మహీంద్రా కొత్త ఎస్యూవీ స్కార్పియో ఎన్
మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్యూవీ స్కార్పియో-ఎన్ను విడుదల చేసింది. 5 వేరియంట్లలో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). జులై 30 నుంచి ఆన్లైన్తో పాటు మహీంద్రా విక్రయశాలల్లో స్కార్పియో-ఎన్ బుకింగ్లు
ప్రారంభ ధర రూ.11.99 లక్షలు
ముంబయి: మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్యూవీ స్కార్పియో-ఎన్ను విడుదల చేసింది. 5 వేరియంట్లలో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). జులై 30 నుంచి ఆన్లైన్తో పాటు మహీంద్రా విక్రయశాలల్లో స్కార్పియో-ఎన్ బుకింగ్లు ప్రారంభమవుతాయని, పండగల సీజన్లో డెలివరీ మొదలుపెడతామని కంపెనీ వెల్లడించింది. ఈ కారు అభివృద్ధికి కంపెనీ రూ.1600 కోట్ల పెట్టుబడులు పెట్టింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల్లో లభించనుంది. స్కార్పియో-ఎన్ను బిగ్డాడీగా మహీంద్రా వ్యవహరిస్తోంది. ఆరు ఎయిర్బ్యాగ్లు, డ్రైవర్ అలిసిపోతే గుర్తించే వ్యవస్థ, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టాటా సఫారీ, హ్యుందాయ్ క్రెటా, టయోటా ఫార్చునర్ వంటి మోడళ్లతో ఈ కారు పోటీపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్