ముంబయిలో కేఫిన్‌ టెక్నాలజీస్‌ కార్యాలయం

షేరు రిజిస్ట్రీ సేవలు అందించే హైదరాబాదీ సంస్థ కేఫిన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, ముంబయిలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 300 మంది ఉద్యోగులను ఆ కార్యాలయంలో నియమించనున్నట్లు సంస్థ వెల్లడించింది. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీకి విస్తరించాలనే

Published : 28 Jun 2022 03:04 IST

దిల్లీ: షేరు రిజిస్ట్రీ సేవలు అందించే హైదరాబాదీ సంస్థ కేఫిన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, ముంబయిలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 300 మంది ఉద్యోగులను ఆ కార్యాలయంలో నియమించనున్నట్లు సంస్థ వెల్లడించింది. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీకి విస్తరించాలనే ఆలోచన చేస్తున్నామని, తద్వారా జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సేవలు అందించే అవకాశం లభిస్తుందని కేఫిన్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. ఈ సంస్థ త్వరలో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు రానుంది. దీనికి అనుమతి కోరుతూ ఇప్పటికే సెబీకి దరఖాస్తు చేసింది. ఈ సంస్థలో జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ ఫండ్‌ పీటీఈ లిమిటెడ్‌కు 74.94 శాతం వాటా ఉంది. కోటక్‌ మహీంద్రా బ్యాంకు గత ఏడాదిలో 9.98 శాతం వాటా కొనుగోలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని