వియత్నాం నుంచి హైదరాబాద్‌కు త్వరలో విమాన సర్వీసులు

వియత్నాం విమానయాన సంస్థ వీట్‌జెట్‌ హైదరాబాద్‌తో పాటు మనదేశంలోని మరో 4 నగరాలకు విమాన సేవలు ప్రారంభించనుంది. వియత్నాంలోని సముద్ర తీర ప్రాంత నగరమైన డా నాంగ్‌ నుంచి భారతదేశంలోని హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు నగరాలకు  

Published : 28 Jun 2022 03:04 IST

ముంబయి: వియత్నాం విమానయాన సంస్థ వీట్‌జెట్‌ హైదరాబాద్‌తో పాటు మనదేశంలోని మరో 4 నగరాలకు విమాన సేవలు ప్రారంభించనుంది. వియత్నాంలోని సముద్ర తీర ప్రాంత నగరమైన డా నాంగ్‌ నుంచి భారతదేశంలోని హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు నగరాలకు  విమాన సర్వీసులు నిర్వహిస్తామని వీట్‌జెట్‌ వెల్లడించింది. ఈ సంవత్సరాంతానికి ఈ సేవలు ప్రారంభమవుతాయని, వారానికి 4-7 విమాన సర్వీసులు ఉంటాయని తెలియజేసింది. దీని వల్ల రెండు దేశాల మధ్య వ్యాపార కార్యకలాపాలు, పర్యాటకుల రాకపోకలు పెరుగుతాయని వివరించింది. డా నంగ్‌ నగరం అంతర్జాతీయంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. వియత్నాం సాంస్కృతిక రాజధానిగా ఈ నగరానికి పేరుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని