1 నుంచి టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలను పెంచబోతున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. పెరుగుతున్న ముడి పదార్థాల వ్యయాల భారాన్ని కొంతమేరైనా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో, వాహనాల ధరలు 1.5-2.5 శాతం పెంచాలనుకుంటున్నట్లు తెలిపింది. మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా

Published : 29 Jun 2022 03:06 IST

దిల్లీ: జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలను పెంచబోతున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. పెరుగుతున్న ముడి పదార్థాల వ్యయాల భారాన్ని కొంతమేరైనా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో, వాహనాల ధరలు 1.5-2.5 శాతం పెంచాలనుకుంటున్నట్లు తెలిపింది. మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా ఈ ధరల పెంపు ఉంటుందని ఎక్స్ఛేంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాల ధరల్ని 1.1 శాతం, వాణిజ్య వాహనాల ధరల్ని 2-2.5 శాతం మేర పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని