గెయిల్‌ తదుపరి సీఎండీగా సందీప్‌ కుమార్‌ గుప్తా

ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా తదుపరి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సందీప్‌ కుమార్‌ గుప్తాను (56) ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో (ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Published : 30 Jun 2022 02:14 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా తదుపరి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సందీప్‌ కుమార్‌ గుప్తాను (56) ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో (ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న గెయిల్‌ ప్రస్తుత సీఎండీ మనోజ్‌ జైన్‌ స్థానాన్ని సందీప్‌ భర్తీ చేయనున్నారు. సందీప్‌ వాణిజ్య శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ చేసి తర్వాత ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ చేశారు. ఐఓసీలో 31 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ సంఘం ఆమోదం లభిస్తే, సందీప్‌ 2026 ఫిబ్రవరి వరకు గెయిల్‌ ఇండియా సీఎండీగా కొనసాగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు