రిలయన్స్ పడేసింది
వరుసగా మూడో రోజూ సూచీలు డీలాపడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వం ఎగుమతి సుంకం విధించడంతో, సెన్సెక్స్లో అధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కుదేలయ్యాయి.
మూడో రోజూ సూచీలు డీలా
సమీక్ష
వరుసగా మూడో రోజూ సూచీలు డీలాపడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వం ఎగుమతి సుంకం విధించడంతో, సెన్సెక్స్లో అధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కుదేలయ్యాయి. ఇంట్రాడేలో 8.82% పడ్డ షేరు రూ.2365 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 7.14% నష్టంతో రూ.2408.95 వద్ద ముగిసింది. అయితే చివర్లో కొనుగోళ్ల చోటుచేసుకోవడంతో, సూచీలకు నష్టాలు పరిమితమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 12 పైసలు కోలుకుని 78.94 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 1.90% పెరిగి 111.1 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 52,863.34 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్లో 900 పాయింట్లకు పైగా కోల్పోయిన సూచీ.. 52,094.25 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. అనంతరం కోలుకున్న సూచీ.. చివర్లో లాభాల్లోకి వచ్చి 53,053.04 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 111.01 పాయింట్ల నష్టంతో 52,907.93 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 28.20 పాయింట్లు తగ్గి 15,752.05 దగ్గర స్థిరపడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 22 లాభపడ్డాయి. ఐటీసీ 3.99%, బజాజ్ ఫైనాన్స్ 3.97%, బజాజ్ ఫిన్సర్వ్ 3.63%, ఏషియన్ పెయింట్స్ 2.80%, హెచ్యూఎల్ 2.34%, హెచ్డీఎఫ్సీ 2.18%, నెస్లే 1.69%, అల్ట్రాటెక్ 1.67%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.63%, టీసీఎస్ 1.56% చొప్పున రాణించాయి. పవర్గ్రిడ్ 2.53%, ఎన్టీపీసీ 1.82%, భారతీ ఎయిర్టెల్ 1.54% నష్టపోయాయి.
* జూన్ 24తో ముగిసిన వారానికి విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు 2.734 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.23,000 కోట్లు) పెరిగి 593.323 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.45,70,000 కోట్లు)కు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి