నిపుణులను కాపాడుకోవడమే సవాలు

కొవిడ్‌ పరిణామాల తరవాత, నైపుణ్యం ఉన్న వారిని ఆకర్షించడం; వారిని అట్టేపెట్టిఉంచుకోవడం కంపెనీలకు అతిపెద్ద సవాలుగా మారిందని ఓ సర్వే వెల్లడించింది. ఈ ఏడాదీ నిపుణులను కాపాడుకోవడమే సవాలుగా ఉందని 78% సంస్థలు అభిప్రాయపడ్డాయని

Published : 06 Jul 2022 03:44 IST

కంపెనీల పరిస్థితులపై సర్వే

ముంబయి: కొవిడ్‌ పరిణామాల తరవాత, నైపుణ్యం ఉన్న వారిని ఆకర్షించడం; వారిని అట్టేపెట్టిఉంచుకోవడం కంపెనీలకు అతిపెద్ద సవాలుగా మారిందని ఓ సర్వే వెల్లడించింది. ఈ ఏడాదీ నిపుణులను కాపాడుకోవడమే సవాలుగా ఉందని 78% సంస్థలు అభిప్రాయపడ్డాయని డబ్ల్యూటీడబ్ల్యూ(విలీస్‌ టవర్స్‌ వాట్సన్‌) నిర్వహించిన ‘రీఇమాజినింగ్‌ వర్క్‌ అండ్‌ రివార్డ్స్‌ సర్వే’ తేల్చింది. ఐటీ, టెలికాం, తయారీ, సాధారణ సేవలు, ఆర్థిక సేవలు, ఇంధన-యుటిలిటీ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లోని 51 కంపెనీలు, 7,23,000 ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారంతో నివేదికను సంస్థ రూపొందించింది. దీని ప్రకారం..

* రెండేళ్లుగా దేశంలోని పలు సంస్థలు ఇబ్బందులు పడ్డాయి. నైపుణ్యం ఉన్న వారి వలసలను ఎదుర్కొంటున్నట్లు 78% కంపెనీలు పేర్కొన్నాయి. ఉద్యోగులను అట్టేపెట్టిఉంచుకోవడంలో ఒత్తిడి ఎదుర్కొన్నట్లు 64% సంస్థలు చెప్పాయి.

* 2020లో మాత్రం ఉద్యోగులను ఆకర్షించడం (29%), అట్టేపెట్టిఉంచుకోవడం (26%) సమస్య అని కొద్ది కంపెనీలే పేర్కొనగా.. 2021 ద్వితీయార్థానికి వచ్చేసరికి ఈ గణాంకాలు వరుసగా 68%, 73 శాతానికి చేరాయి.

* 2022లో నిపుణులను అట్టేపెట్టిఉంచుకోవడానికి కష్టపడుతున్న కంపెనీల సంఖ్య 64 శాతానికి పరిమితమైంది. కావాల్సిన నైపుణ్యాలున్న వారిని ఆకర్షించడం సమస్యగా మారిన సంస్థల సంఖ్య 78 శాతానికి పెరిగింది.

* డిజిటల్‌ అనుభవం ఉన్న సిబ్బందిని ఆకర్షించడం, అట్టేపెట్టిఉంచుకోవడం అనే సవాళ్లు ఎదురైనట్లు 85 శాతం సంస్థలు పేర్కొన్నాయి. విక్రయాల విభాగంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు 74% కంపెనీలన్నాయి.

* పనిప్రదేశానికి సిబ్బంది తిరిగి వచ్చే విషయంలో; కరోనా సంబంధిత విధానాలకు ముగింపు పలికే విషయంలో ఇంకా వెనకబడే ఉన్నట్లు 54% సంస్థలు పేర్కొన్నాయి. ఈ విషయంలో 2023 లేదా ఆ తర్వాతే సాధారణ పరిస్థితులు కనిపించొచ్చని 12 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని