యూపీఐ తరహాలో ఓఎన్డీసీ విజయం
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) తరహాలోనే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) విజయవంతమవుతుందని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇ-కామర్స్ లేదా బీ2బీ లేదా నేరుగా వినియోగదార్లతో వ్యాపారం చేయడానికి ఔత్సాహిక
ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్
గాంధీనగర్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) తరహాలోనే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) విజయవంతమవుతుందని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇ-కామర్స్ లేదా బీ2బీ లేదా నేరుగా వినియోగదార్లతో వ్యాపారం చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఓఎన్డీసీ సహాయం చేయగలదని నేషనల్ స్టార్టప్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో ఆయన పేర్కొన్నారు. దిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్లలో ప్రయోగాత్మకంగా గత ఏప్రిల్లో ఓఎన్డీసీని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. వినియోగదార్లు కూడా కావాల్సిన విక్రేత, ఉత్పత్తి, సేవలను ఓఎన్డీసీ యాప్ ద్వారా ఎంచుకోవచ్చు. తద్వారా వీరికి ఎంపిక స్వేచ్ఛ పెరుగుతుంది. అంకురాల నిర్వాహకులు యూపీఐని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘యూపీఐ ఒక అద్భుత సేవ. ఇప్పటికే దీని వినియోగానికి 3 దేశాలు ముందుకొచ్చాయి. దీనిని మరిన్ని దేశాలకు మనం ఎందుకు తీసుకెళ్లకూడద’ని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్