11 ఏళ్ల గరిష్ఠానికి సేవల వృద్ధి
భారత సేవా రంగ కార్యకలాపాల వృద్ధి జూన్లో 11 నెలల గరిష్ఠానికి చేరింది. ఈ రంగానికి వ్యయాల ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ.. గిరాకీ పరిస్థితులు పుంజుకోవడం ఇందుకు దోహదం చేసింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సేవా రంగ పీఎంఐ సూచీ మేలో 58.9 పాయింట్లు కాగా..
దిల్లీ: భారత సేవా రంగ కార్యకలాపాల వృద్ధి జూన్లో 11 నెలల గరిష్ఠానికి చేరింది. ఈ రంగానికి వ్యయాల ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ.. గిరాకీ పరిస్థితులు పుంజుకోవడం ఇందుకు దోహదం చేసింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సేవా రంగ పీఎంఐ సూచీ మేలో 58.9 పాయింట్లు కాగా.. జూన్లో 59.2 పాయింట్లకు పెరిగింది. 2011 ఏప్రిల్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. సూచీ 50 పాయింట్లకు పైన ఉంటే వృద్ధి ఉన్నట్లు, దిగువన ఉంటే క్షీణతగా భావిస్తారు. గత 11 నెలలుగా సేవా రంగంలో వృద్ధి కొనసాగుతోంది. ‘సేవలకు గిరాకీ గణనీయ స్థాయిలో పెరిగింది. 2011 ఫిబ్రవరి తర్వాత గిరాకీ అంతలా పెరిగింది ఇప్పుడే. 2022-23 తొలి త్రైమాసికంలో ఈ రంగ కార్యకలాపాలు గొప్పగా పుంజుకున్నాయ’ని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పాలియనా డె లిమా తెలిపారు. కొవిడ్-19 ఆంక్షల తొలగింపు అనంతరం డిమాండు మెరుగవడం, సామర్థ్య విస్తరణ, సానుకూల ఆర్థిక పరిస్థితుల లాంటివి ఈ రంగ వృద్ధికి దోహదం చేశాయని అన్నారు. సేవా రంగంలో వ్యయాల ఒత్తిళ్లు మూడు నెలల కనిష్ఠానికి దిగివచ్చినా, ఇప్పటికే అధిక స్థాయిల్లోనే ఉన్నాయని లిమా చెప్పారు. కంపెనీలకు ధరల నిర్ణాయక శక్తి పెరగడం, మెరుగైన గిరాకీ పరిస్థితులు, ముడి సరకుల ద్రవ్యోల్బణం అయిదేళ్ల గరిష్ఠానికి చేరడం ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్