ఆధార్తో పాన్ను జత చేశారా?
మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను... మీ ఆధార్తో అనుసంధానం చేశారా? ఇప్పటికీ చేయకపోతే వెంటనే త్వరపడండి. మార్చి 31 లోగా ఈ పని పూర్తి చేయకపోతే రూ.10వేల జరిమానా చెల్లించాల్సి
మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను... మీ ఆధార్తో అనుసంధానం చేశారా? ఇప్పటికీ చేయకపోతే వెంటనే త్వరపడండి. మార్చి 31 లోగా ఈ పని పూర్తి చేయకపోతే రూ.10వేల జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
ఆధార్తో పాన్ను అనుసంధానించుకోవాల్సిందిగా సూచిస్తూ.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గత ఏడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనికి చివరి తేదీగా మార్చి 31, 2021ని నిర్ణయించింది. ఆలోపు మీరు ఈ రెండింటినీ అనుసంధానించకపోతే.. ఏప్రిల్ 1, 2021 నుంచి పాన్ చెల్లకుండా పోతుంది. దీంతోపాటు.. ఆ పాన్ ఉన్న వ్యక్తి దగ్గర్నుంచి రూ.10వేల వరకూ జరిమానాను విధించే ఆస్కారమూ ఉంది.
పాన్ కార్డులు చాలా ఆర్థిక లావాదేవీల్లో కీలకం. బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు, మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో మదుపు చేయాలన్నా.. రూ.50,000 మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్ తప్పనిసరి అవసరం. పాన్ చెల్లుబాటులో లేకపోతే.. ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇదే కాదు.. ఆస్తుల క్రయవిక్రయాలకూ ఇబ్బంది తలెత్తుతుంది. జరిమానా చెల్లించి, పాన్తో ఆధార్ను అనుసంధానం చేసుకున్నప్పుడే మళ్లీ వీటిని అనుమతిస్తారు.
* పాన్, ఆధార్లను జత చేయడం ఎంతో తేలిక. ఇన్కంట్యాక్స్ఇఫైలింగ్ వెబ్సైటులోకి వెళ్లి.. ఈ పనిని పూర్తి చేయొచ్చు.
* మొబైల్ నుంచి సంక్షిప్తం సందేశం పంపించడం ద్వారానూ దీన్ని పూర్తి చేయొచ్చు. ఆధార్తో అనుసంధానం అయిన మొబైల్ నెంబరు నుంచి UIDAIPAN అని టైప్ చేసి 12 అంకెల ఆధార్ నెంబరు, స్పేస్ ఇచ్చి, పాన్ నెంబరును.. 567678 లేదా 56161 అనే నెంబర్లకు సందేశం పంపించాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆధార్, పాన్ వివరాలన్నీ ఒకే విధంగా ఉండాలి. ఉదాహరణకు పాన్, ఆధార్లో పుట్టిన తేదీ వేర్వేరుగా ఉంటే.. అనుసంధానం కుదరకపోవచ్చు. పేరులో తప్పులున్నా సాధ్యం కాదు.
* ఇప్పటికే మీరు ఈ రెండింటినీ జత చేసుకున్నా.. మరోసారి ఇఫైలింగ్ వెబ్సైటులోకి వెళ్లి, చూసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి