యూఎస్‌లోని 50 పెద్ద కంపెనీల్లో...

ఇటీవల కాలంలో ఈటీఎఫ్‌లకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో మిరే అసెట్‌ ఎస్‌అండ్‌పి 500 టాప్‌ ఈటీఎఫ్‌ అనే నూతన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని మిరే

Published : 03 Sep 2021 01:41 IST

మిరే అసెట్‌ ఎస్‌అండ్‌పి 500 టాప్‌ ఈటీఎఫ్‌

టీవల కాలంలో ఈటీఎఫ్‌లకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో మిరే అసెట్‌ ఎస్‌అండ్‌పి 500 టాప్‌ ఈటీఎఫ్‌ అనే నూతన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఎస్‌అండ్‌పి 500 ఇండెక్స్‌లో భాగంగా ఉన్న యూఎస్‌లోని 50 పెద్ద కంపెనీల్లో ఈ ఫండ్‌ పెట్టుబడి పెడుతుంది. ఐటీ, హెల్త్‌కేర్‌, ఫైనాన్షియల్స్‌, ఇంధన రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ పథకం ముగింపు తేదీ ఈ నెల 14. కనీస పెట్టుబడి రూ.5,000. ఎస్‌అండ్‌పి 500 టాప్‌ 50 టోటల్‌ రిటన్‌ ఇండెక్స్‌ (టీఆర్‌ఐ)తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. తమ పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలని కోరుకునే మదుపరులకు ఈ ఫండ్‌ అనువుగా ఉంటుంది. పైగా యూఎస్‌కు చెందిన ప్రపంచ స్థాయి కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని