- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
12 శాతం రాబడి రావాలంటే
నేను నెలకు రూ.5వేల చొప్పున రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. దీనికి బదులుగా కనీసం 12 శాతం వరకూ రాబడి వచ్చేలా మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చా? నష్టభయం లేకుండా ఉండే పథకాలు ఏముంటాయి? - నరేశ్
* ప్రస్తుతం మన దగ్గర వడ్డీ రేట్లు కనీస స్థాయికి వచ్చాయి. సురక్షితమైన పథకాల పైన 5% - 6.5% వరకూ వడ్డీ వస్తోంది. నష్టభయం లేకుండా ఉండాలంటే.. మీకు వచ్చే రాబడి 5% - 6.5% మధ్యే ఉంటుంది. కాబట్టి, మీకు 12 శాతం రాబడి రావాలంటే.. నష్టభయంతో ఉన్న పెట్టుబడి పథకాలతోనే సాధ్యం అవుతుంది. దీనికి మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. వీటిలో 12% - 13% వచ్చే అవకాశం ఉంది. నష్టభయం లేకుండా అంటే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు పథకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
మా అమ్మ పేరుమీద ఉన్న బీమా పాలసీ నుంచి రూ.4 లక్షల వరకూ వచ్చాయి. ఈ మొత్తాన్ని మరో నాలుగేళ్లదాకా ఎక్కడైనా జమ చేసి, మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోవాలనేది ఆలోచన. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? - విజయ్
* మీ పెట్టుబడిపైన మంచి రాబడి రావాలంటే.. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు మదుపు చేద్దామని అనుకుంటున్న రూ.4 లక్షలను రెండు మంచి హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లలో ఎస్టీపీ ద్వారా వచ్చే ఆరు నెలల కాలానికి మదుపు చేయండి. కనీసం 10 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. కాస్త నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు.
నాలుగేళ్ల తర్వాత అవసరాల కోసం ఇప్పటి నుంచే బంగారంలో మదుపు చేయాలని ఆలోచన. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లలో వేటిని ఎంపిక చేసుకోవాలి? నెలకు రూ.10 వేలు మదుపు చేయొచ్చా? - ప్రశాంతి
* బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఫండ్ల ద్వారా మదుపు చేసేందుకు వీలుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా మదుపు చేసేందుకు మీకు డీమ్యాట్ ఖాతా ఉండాలి. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్.. ఒక గ్రాము బంగారంతో సమానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయంగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల ద్వారా మదుపు చేసుకోవచ్చు. దీనికి డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. వీటిల్లో కనీసం రూ.500 నుంచీ పెట్టుబడి పెట్టొచ్చు. మీరు రెండు మంచి గోల్డ్ ఫండ్లు ఎంచుకొని, క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.
నేను ఇప్పటి వరకూ ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదు. స్టాక్ మార్కెట్లో మదుపు చేసేందుకు ఇప్పుడు సరైన సమయమేనా? దీనికోసం నెలకు రూ.15 వేల వరకూ కేటాయించగలను. ఎలాంటి షేర్లను ఎంచుకోవాలి? - హరీశ్
* స్టాక్ మార్కెట్లో మదుపు చేసేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మార్కెట్ పనితీరుపై పూర్తిగా అవగాహన ఉండాలి. తగినంత సమయం కేటాయించాలి. షేర్ల కదలికలను గమనిస్తూ ఉండాలి. కనీసం 7-10 ఏళ్లపాటు అవసరం లేని డబ్బునే ఈ పెట్టుబడులకు ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లు కొంత అధిక స్థాయుల వద్ద ఉన్నాయి. మీరు నెలనెలా మదుపు చేయాలనుకుంటున్నారు కాబట్టి, ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మీరు నెలకు రూ.15 వేలను 10 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 13శాతం రాబడి అంచనాతో.. రూ.33,15,554 అయ్యేందుకు వీలుంది.
- తుమ్మ బాల్రాజ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్కే ఎక్కువ అవకాశాలు..!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
India News
Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: నీతీశ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Indian Army: సియాచిన్లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Flight: గర్ల్ఫ్రెండ్తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Crime News: బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!