పన్ను ఆదాకు మార్గాలివీ..
* నేను ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద ఈపీఎఫ్ పోను ఇంకా రూ.1,10,000 వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు కోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?
- మణి
మీరు పన్ను మినహాయింపు కోసం.. సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మదుపు చేయొచ్చు. మీరు రూ.40వేలను ఈపీఎఫ్లో జమ చేస్తున్నారు. మిగిలిన రూ.1,10,000 నుంచి రూ.35 వేలను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో పెట్టుబడి పెట్టండి. మిగతా రూ. 75,000 ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్)లో మదుపు చేయొచ్చు. వీటిల్లో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈఎల్ఎస్ఎస్లో అతి తక్కువ లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇందులో కనీసం మూడేళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీ పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి మదుపు చేసినా.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచే.. క్రమానుగత పెట్టుబడి విధానాన్ని ఎంచుకోండి. నెలకు రూ.6,250 చొప్పున పెట్టుబడి పెట్టండి.
* మా బాబు వయసు 14 ఏళ్లు. మరో ఆరేళ్ల తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.25,000 వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఏం చేయాలి?
- వెంకట్
ముందుగా మీ బాబు భవిష్యత్ అవసరాలకు రక్షణ కల్పించేందుకు మీపైన తగిన మొత్తానికి టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. మీరు మదుపు చేయాదలనుకుంటున్న మొత్తం నుంచి విద్యా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి వచ్చేలా చూసుకోవాలి. దీనికోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయండి. ఆరేళ్లపాటు నెలకు రూ.25,000 పెట్టుబడి పెడితే.. దాదాపు రూ.25లక్షల వరకూ జమ అయ్యే అవకాశం ఉంది.
- తుమ్మ బాల్రాజ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
-
India News
Shashi Tharoor: శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Tamil Rockerz: ‘సినీ పైరసీ భూతం’ హెడ్ అతడే.. ‘తమిళ్ రాకర్స్’ ట్రైలర్ చూశారా!