మిడ్క్యాప్ షేర్లలో...
ఈక్విటీ మార్కెట్లను స్థూలంగా గమనిస్తే.. దీర్ఘకాలంలో మిడ్క్యాప్ షేర్లు ఆశాజనకంగానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి మరింత సానుకూలంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి కోసం..
ఈక్విటీ మార్కెట్లను స్థూలంగా గమనిస్తే.. దీర్ఘకాలంలో మిడ్క్యాప్ షేర్లు ఆశాజనకంగానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి మరింత సానుకూలంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి కోసం మిడ్క్యాప్లను ఎంచుకునేవారి సంఖ్య పెరుగుతుండటంతో.. ఈ విభాగంలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21 వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్ఎఫ్ఓ కాలంలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ ఫండ్ పాసివ్ పెట్టుబడి వ్యూహాన్ని పాటిస్తుంది. సమీకరించిన మొత్తాన్ని అత్యధిక లిక్విడిటీ ఉన్న 50 మిడ్క్యాప్ షేర్లకు కేటాయిస్తారు. పోర్ట్ఫోలియోలో మిడ్క్యాప్ ఫండ్లు ఉండాలని అనుకునే వారు.. సిప్, ఎస్టీపీ, ఏక మొత్తం విధానాల్లో ఈ ఫండ్లో మదుపు చేయొచ్చు. నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ టీఆర్ఈ ప్రామాణికంగా పనిచేసే ఈ ఫండ్ను సంస్థ ఈక్విటీ హెడ్ జినేశ్ గోపాని నిర్వహిస్తున్నారు.
అమెరికా కంపెనీల్లో..
అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్లో నమోదైన 100 కంపెనీల్లో మదుపు చేసే అంతర్జాతీయ ఫండ్ను నవీ మ్యూచువల్ ఫండ్ విడుదల చేసింది. దీనిపేరు నవీ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్. నాస్డాక్ 100 ఇండెక్స్ ఈటీఎఫ్/ఇండెక్స్ ఫండ్లలో ప్రధానంగా ఐటీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది. తక్కువ ఖర్చుతో అమెరికాలోని పెద్ద కంపెనీల్లో మదుపు చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తోందని సంస్థ చెబుతోంది. ఎన్ఎఫ్ఓ మార్చి 17 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఓపెన్ ఎండెడ్ పథకంలో కనీస పెట్టుబడి రూ.500.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ