వైద్యుల కోసం పాలసీ...
వృత్తిపరంగా పొరపాట్లు జరిగినప్పుడు వైద్యులకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. కొన్నిసార్లు నష్టపరిహారం సైతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వారికి ధీమానిచ్చేలా ఐసీఐసీఐ లాంబార్డ్ డాక్టర్ల కోసం ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వృత్తిపరంగా పొరపాట్లు జరిగినప్పుడు వైద్యులకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. కొన్నిసార్లు నష్టపరిహారం సైతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వారికి ధీమానిచ్చేలా ఐసీఐసీఐ లాంబార్డ్ డాక్టర్ల కోసం ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల స్పెషలైజేషన్లకూ ఇది వర్తిస్తుంది. వేగంగా పాలసీని జారీ చేయడంతోపాటు, పూర్తిగా పారదర్శకంగా ఉండేలా దీన్ని తీసుకొచ్చినట్లు బీమా సంస్థ వెల్లడించింది. క్లెయింల సందర్భంలో వైద్యులకు అవసరమైన న్యాయ సేవలనూ ఇందులో భాగంగా అందిస్తారు. కొన్నిసార్లు ఎలాంటి పొరపాటూ లేకపోయినా క్లెయింలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనూ ఈ పాలసీ అవసరమైన న్యాయ, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పాలసీని ఎస్ఎంఈ విభాగం కింద అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఏజెంట్లు లేదా ఆన్లైన్లో ఈ పాలసీని తీసుకునేందుకు వీలుంది.
రిటర్నులు దాఖలు చేయలేదా?
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారికి అధిక మొత్తంలో టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) విధించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం (మదింపు సంవత్సరం 2021-22)కు సంబంధించిన రిటర్నులు దాఖలు చేయని వారిని ‘స్పెసిఫైడ్ పర్సన్’గా ఆదాయపు పన్ను విభాగం గుర్తించింది. వీరికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో టీడీఎస్ విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించి టీడీఎస్ ఉన్నవారు రిటర్నులు దాఖలు చేయకపోతేనే ఈ నిబంధన వర్తిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించిన రిటర్నులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసినవారిని ఈ జాబితాలో నుంచి తొలగిస్తారు. అధిక టీడీఎస్ వసూలు కోసం ప్రత్యేకంగా సెక్షన్ 206ఏబీని, సెక్షన్ 206సీసీఏని టీసీఎస్ కోసం తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ