మ్యూచువల్ ఫండ్లపై రుణాల కథాకమామీషు తెలుసుకుందాం
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారా?, అలాగే మీకు అత్యవసరంగా డబ్బు అవసరపడినప్పుడు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారా? అలా చేయాల్సిన అవసరం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంటోంది. మ్యూచువల్ ఫండ్లను హామీగా పెట్టుకుని డిజిటల్ రుణాలను ఇచ్చే
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారా?, అలాగే మీకు అత్యవసరంగా డబ్బు అవసరపడినప్పుడు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారా? అలా చేయాల్సిన అవసరం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంటోంది. మ్యూచువల్ ఫండ్లను హామీగా పెట్టుకుని డిజిటల్ రుణాలను ఇచ్చే పథకాన్ని బ్యాంక్ ఈ నెల 23 నుంచి ప్రారంభించింది. బ్యాంకుల్లో ఓవర్డ్రాఫ్ట్ పథకం మాదిరే ఇందులోనూ క్షణాల్లో రుణాలు పొందవచ్చు. మరి దీనిని ఎంచుకున్నారా?
అసలు ఈ పథకం ఏంటీ?
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్ల హోల్డింగ్లను హామీగా చూపించి రుణాలు తీసుకోవడం సాధ్యమే. అయితే హెచ్డీఎఫ్సీ ప్రారంభించిన ఈ ఫథకం పూర్తిగా కాగిత రహితంగా, ఆన్లైన్ ద్వారా రుణాలను పొందవచ్చు. దీనికి కేవలం హెచ్డీఎఫ్సీ బ్యాంకు పొదుపు ఖాతా ఉంటే సరిపోతుంది.
కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(క్యామ్స్)లో నమోదైన ఫండ్ హౌజ్లపై బ్యాంక్ ఈ తరహా రుణాలను అందిస్తోంది. క్యామ్స్ దేశంలో అగ్రశ్రేణి రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ సేవల సంస్థ. ఇందులో 10 ఫండ్హౌజ్లు నమోదై ఉన్నాయి. వాటిని ఈ కింద పట్టికలో వివరించాం. అయితే ఇతర ఫండ్ హౌజ్ల మ్యూచువల్ ఫండ్ యూనిట్ల పైనా రుణాలిస్తామని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.
సులభంగా ఈ రుణాలను పొందవచ్చని బ్యాంకు తెలిపింది. రుణగ్రహీతలు తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలోకి లాగిన్ అయి ప్రాథమిక వివరాలు నింపి, ఈక్విటీ లేదా డెట్ ఫండ్లలో వేటిపై రుణాలు కావాలో ఆ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత బ్యాంకు ఆ ధరఖాస్తులను క్యామ్స్కు పరిశీలన కోసం పంపబడుతుంది. క్యామ్స్ రుణగ్రహీతల మ్యూచువల్ ఫండ్ హోల్గింగ్స్లను పరిశీలిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణ గ్రహీతలు తమ ఈక్విటీ ఫండ్లలో 50 శాతం, డెట్ ఫండ్లలో 80 శాతం వరకూ రుణాలను పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఈక్విటీ ఫండ్లపై రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు, డెట్ ఫండ్ల పై రూ.1 కోటి వరకు రుణాలనిస్తోంది. ఇది ఓవర్డ్రాఫ్ట్ లాంటిది కాబట్టి ఈ రుణాలకు నిర్ణీత కాలవ్యవధి లేదు. అయితే ఏటా రుణాన్ని పునరుద్దరించుకోవాలి. మీరు ఫండ్లు, యూనిట్ల సంఖ్యను ఎంచుకున్న తర్వాత, మీ ధరఖాస్తు ప్రక్రియ పరిశీలనకు వెళ్లి, క్షణాల్లో రుణం మంజూరు చేయబడుతుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, మీకు రుణం మంజూరీ కోసం సంబంధిత బ్యాంకులో ఖాతా తెరవాల్సి ఉంటుంది.
ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఈ రుణ మంజూరీ ప్రక్రియ పూర్తి కాగిత రహితంగా, ఆన్లైన్లో ఉంటుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఫండ్లను బదిలీ చేయాల్సిన అవసరం లేదు. వేరే సంస్థల సెక్యూరిటీలపై కూడా రుణం పొందవచ్చు. క్యామ్స్ వెబ్సైట్లో మీ హోల్డింగ్స్ అన్నీ ఒకే చోట ఉన్న విషయాన్ని మీరు పరిశీలించవచ్చు. మ్యూచువల్ ఫండ్ల మీద రుణాలు తీసుకున్నప్పటికీ, వాటికి హక్కుదారులు మీరే. అయితే రుణం తిరిగి చెల్లించేంత వరకూ వాటిని విక్రయించే హక్కు మాత్రం లేదు.
ఎవరెవరు అనర్హులు?
ప్రస్తుతానికి, ఈ సదుపాయం కేవలం సింగిల్ హోల్డింగ్ ఫోలియోలకు మాత్రమే. అయితే అతి త్వరలోనే, అన్ని రకాల హోల్డింగ్ పోర్ట్ఫోలియోలకు రుణాలను ఇవ్వనున్నట్లు బ్యాంకు ఉన్నతాధికారి తెలిపారు. సెక్యూరిటీలు, ఫండ్లను హామీగా చూపించి రుణం పొందడం చాల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఈ రుణాలపై బ్యాంకు ఇంకా వడ్డీ రేట్లను నిర్ణయించలేదు. వినియోగదారులతో తమ సంబంధాలను బట్టి రుణ వడ్డీ రేట్లు ఉంటాయని బ్యాంకు అన్నప్పటికీ, ఇది 10-11.5 శాతం వార్షిక వడ్డీ ఉండొచ్చని బ్యాంకు ఉన్నతాధికారి అన్నారు. దీంతో పాటు ప్రతీ లావాదేవీకి రూ.1499 ప్రాసెసింగ్ రుసుములుంటాయని ఆయన అన్నారు.
చివరిగా…
ఏడాది క్రితం, దేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ల డిస్ట్రిబ్యూటర్లలో ఒకటైన ఎన్జే ఇండియా ఇన్వెస్ట్ ఈ తరహా రుణాలను బజాజ్ ఫైనాన్స్తో కలిపి ప్రారంభించింది. అయితే ఎన్జే ఇండియా ఇన్వెస్ట్ తమ మదుపరుల మ్యూచువల్ ఫండ్ యూనిట్లను డీమ్యాట్ రూపంలో ఉంచినందునా, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ సంస్థలతో జత కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఒక మదుపరిగా మీకు ఇది అంత ముఖ్యమైన అంశం కానప్పటికీ, హెచ్డీఎఫ్సీ లో ఈ తరహా రుణాలను సులభంగా పొందవచ్చు.
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్లను తనఖా పెట్టి రుణాలను తీసుకున్నారా. అయితే ఈక్విటీ మార్కెట్లు కుదేలయినప్పుడు ఈ తరహా రుణాలు తీసుకుంటే మీకు అందే రుణ మొత్తం 20-25 శాతం తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్లను నష్టాలకు అమ్ముకునే బదులు, ఆ యూనిట్లను మీ వద్దనే ఉంచుకుని వాటిపై రుణాలు తీసుకోవడం మంచిది. మార్కెట్లు తిరిగి రికవరీ బాట పట్టినప్పుడు మీ యూనిట్లు మళ్లీ వృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణుడొకరు అన్నారు. అయితే మీ పోర్ట్ఫోలియో లాభాల్లో ఉండి, మీకు డబ్బు అవసరపడినప్పుడు, రుణం తీసుకునే బదులు యూనిట్లను అమ్మేయడమే మంచిది.
దీనిపై ఎన్జే ఇండియా ఇన్వెస్ట్ నేషనల్ హెడ్ మిస్బా బక్సాముసా మాట్లాడుతూ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు, మీకు రుణం అవసరపడితే, మీ యూనిట్లలో 50 శాతం లోపే హామీగా పెట్టేందుకు ప్రయత్నించండని తెలిపారు. అలాగే మార్కెట్లు రాణిస్తున్నప్పుడు, మీ పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే మంచిది. ఒకవేళ నష్టాల్లో ఉన్నప్పడు, అత్యవసర డబ్బు కోసం యూనిట్లను కుదవపెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!