మీ వాహ‌నానికి బీమా ప‌రిహారం ఇలా నిర్ణ‌యిస్తారు...

వాహన కంపెనీ, మోడల్‌, రూపొందించిన సంవత్సరం లాంటివి పరిగణనలోకి తీసుకొని బీమా ప‌రిహారం నిర్ణ‌యిస్తారు

Published : 22 Dec 2020 18:52 IST

వాహ‌నం దొంగ‌తనానికి గురైనా, లేదా ప్ర‌మాదం వ‌ల్ల పూర్తి న‌ష్టం ఏర్ప‌డినా గ‌రిష్ఠ బీమా ప‌రిహారం ఇచ్చేలా బీమా కంపెనీ చూసుకుంటుంది. ఇందుకోసం మోటారు పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలోనే బీమా ప్రకటిత విలువ (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ, ఐడీవీ) లెక్కిస్తారు.

వాహన కంపెనీ, మోడల్‌, రూపొందించిన సంవత్సరం, కొనుగోలు ధరను పరిగణనలోకి తీసుకొని వాహన వాడుక కాలానికి తరుగుదల విలువను తొలగించి ఎంతైతే విలువ వ‌స్తుందో దానినే ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూగా నిర్ణ‌యిస్తారు.

నియమనిబంధనలను అనుసరించి వాహనాన్ని మరమ్మతు చేసేందుకు అయ్యే ఖర్చు బీమా ప్రకటిత విలువ కన్నా 75శాతం దాటితే ‘ కన్ర్ట్రక్టివ్‌ టోటల్‌ లాస్‌’ (పూర్తి నష్టం)గా ప‌రిగ‌ణిస్తారు

తరుగుదల విలువ లెక్కింపు

వాహనం వాడుక‌ కాలాన్ని బట్టి తరుగుదల విలువ (డిప్రిషియేష‌న్ వాల్యూ)ను లెక్కించాల్సి ఉంటుంది. బీమా ప్రకటిత విలువ లెక్కింపులో ఈ త‌రుగుద‌ల విలువ‌నే ముందుగా చూస్తారు.

Screen Shot 2017-05-15 at 11.35.44.png

విడిభాగాల మ‌రమ్మ‌తు లేదా కొత్త‌వి అమ‌ర్చుకునేందుకు…

వాహ‌నానికి ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు పాడైన విడిభాగాలకు బదులు కొత్తవి అమర్చుకునేందుకు లేదా వాటినే మరమ్మతు చేయించుకునేందుకు ఖర్చు అవుతుంది. దీని కోసం పూర్తి బీమాను క్లెయిం చేసుకోకుండా కొంత మేర‌కు ప‌రిహారం అడ‌గ‌వ‌చ్చు. వాహ‌న వాడుక కాలానికి సంబంధం లేకుండా విడిభాగాల ర‌కాన్ని బ‌ట్టి తరుగుదల విలువ ఉంటుంది.

  • రబ్బరు, నైలాన్‌, ప్లాస్టిక్‌, టైర్లు, ట్యూబులు, బ్యాటరీలు, ఎయిర్‌బ్యాగులు-- 50శాతం

  • ఫైబర్‌ గ్లాస్‌ భాగాలకు – 30శాతం

  • గాజుతో తయారైన విడిభాగాలకు ఏమీ లేదు

  • ఇతర విడిభాగాలకు (చెక్కతో చేసినవి కూడా) వాహనం వాడుతున్న కాలాన్ని బట్టి తరుగుదల నిర్ణ‌యిస్తారు.

Screen Shot 2017-05-15 at 11.38.48.png

భౌగోళిక పరిమితులు

వాహన బీమాను కొనుగోలు చేసేటప్పుడే వాహనం రిజిస్టర్‌ అయిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని దాని భౌగోళిక పరిమితిని నిర్ణయిస్తారు.
ప్రైవేటు వాహనాలు, ద్విచక్రవాహనాల విషయంలో భారత దేశం మొత్తాన్ని రెండు జోన్లుగా విభజించారు.

జోన్‌ ఏ : అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, న్యూ దిల్లీ, పూణె
జోన్‌ బి : దేశంలోని మిగిలిన ప్రాంతాలు

సాధారణంగా జోన్‌ (ఏ) పరిధిలో రిజిస్టర్‌ అయిన వాహనాలకు ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది. కొన్ని బీమా కంపెనీలు భౌగోళిక పరిధి దాటిన తర్వాత వాహనానికి జరిగే నష్టానికి క్లెయిం అందించవు.

మోటారు వాహనాల చట్టాన్ని అనుసరించి మన వాహనానికి భౌగోళిక పరిమితులను పెంచుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, మాల్దీవులు దేశాల్లో భౌగోళిక పరిమితులను పొందేందుకు చెల్లించాల్సిన అదనపు ప్రీమియం ప్యాకేజీ పాలసీలకైతే రూ.500, ఇతర పాలసీలకు అయితే రూ.100. 12 నెలల కాలపరిమితితో అన్ని రకాల వాహనాలకు ఇదే ప్రీమియం వర్తిస్తుంది.

ఈ పరిధి పెంచుకున్న ప్రాంతాల్లో వాహనానికి జరిగే నష్టానికి, అందులో ప్రయాణించే వారికి, సముద్రమార్గం లేదా వాయుమార్గంలో తరలించేటప్పుడు వాహనానికి కలిగే నష్టానికి ఎలాంటి బీమా వర్తించదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని