తక్కువ నష్టభయంతో
ఇది బ్యాలెన్స్డ్ ఫండ్ల సమయం. స్టాక్ మార్కెట్ సూచీలు అత్యధిక స్థాయిలో కనిపిస్తూ, ఈక్విటీ పెట్టుబడుల్లో నష్టభయం అధికమైన నేపథ్యంలో కొంతమేరకు రుణ పత్రాల్లో,
ఇది బ్యాలెన్స్డ్ ఫండ్ల సమయం. స్టాక్ మార్కెట్ సూచీలు అత్యధిక స్థాయిలో కనిపిస్తూ, ఈక్విటీ పెట్టుబడుల్లో నష్టభయం అధికమైన నేపథ్యంలో కొంతమేరకు రుణ పత్రాల్లో, మరికొంత ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు వీలైన ‘హైబ్రిడ్- డైనమిక్ అసెట్ అలకేషన్’ పథకాలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పెరిగింది. ఇదే కోవలో మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ ‘మహీంద్రా మనులైఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ యోజన’ ను ఆవిష్కరించింది. ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 23. కనీస పెట్టుబడి రూ.1,000. ఈ పథకం కింద సేకరించిన నిధులను ఈక్విటీలో లేదా రుణపత్రాల్లో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, స్టాక్మార్కెట్ వాల్యుయేషన్లు, టెక్నికల్ అనాలసిస్, వివిధ రంగాల్లోని కంపెనీల వృద్ధి అంచనాలు, వడ్డీరేట్ల తీరుతెన్నులు, ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత... వంటి పలు అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, తదనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో ఒక మోస్తరు ప్రతిఫలం చాలనుకునే వారికి అనుకూలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు