రీఫండ్‌లు ఆల‌స్యం కావ‌చ్చు..

సాంకేతికంగా సిపిసీ 2.0కి అప్‌గ్రేడ్ అవున్నందున రీఫండ్‌లు ఆల‌స్యం అవుతున్నాయ‌ని ఐటీ శాఖ తెలిపింది

Updated : 02 Jan 2021 19:56 IST

ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు చేసి నెల‌లు గుడుస్తున్న‌ప్ప‌టీ మీకు రీఫండ్ రాలేదా? ఆందోళ‌న ప‌డ‌కండి. ఈ ఇబ్బంది మీకు మాత్ర‌మే కాదు. దేశ‌వ్యాప్తంగా చాలా మందికి ఇప్ప‌ట‌కీ రీఫండ్ జ‌మ‌కాలేదు. ఐటీఆర్‌ల‌ను మ‌రింత వేగంగా ప్రాసెస్ చేసేందుకు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌లు ఇందుకు కార‌ణం కావ‌చ్చు.

అసెస్మెంట్ సంవ‌త్స‌రం 2020-21కి సంబంధించి జూన్‌, జులై మాసాల‌లో ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారిలో కూడా చాలా మందికి రీఫండ్ రాలేదు. దీనిపై చాలా మంది ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ ఆందోళ‌న‌లు తెలియ‌జేయ‌డంతో ఆదాయ‌పు ప‌న్ను శాఖ స్పందించింది. “ప‌న్ను చెల్లింపు దారుల‌కు మైరుగైన సేవ‌ల‌ను అందించేందుకు, ఐటీఆర్ ప్రాసెస్‌ను మ‌రింత వేగంగా పూర్తిచేసేందుకు ప్లాట్‌ఫామ్‌(సిపిసి-2.0)కు అప్‌గ్రేడ్ చేస్తున్నాము. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఇంకా రిఫండ్‌లు చెల్లించ‌లేదు. కొత్త వ్య‌వ‌స్థ‌కు మారుతున్న నేప‌ధ్యంలో స‌హ‌నంతో వేచి ఉన్నందుకు ధ‌న్య‌వాద‌ములు.” అని ట్విట్ట‌ర్‌లో తెలిపింది.

అయితే సిపిసి2.0 కు న‌వీక‌రించేందుకు ఎన్ని రోజులు స‌మ‌యం ప‌డుతుందో, ఏవై20-21 ఐటీ రిట‌ర్నులు ప్రాసెస్ చేయడం ఎప్పుడు మొద‌ల‌వుతుందో ఈ ట్వీట్‌లో ప్ర‌స్తావించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు బెంగుళూరులోని సెంట్ర‌లైజెడ్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌(సిపిసి)లో ఫైల్ చేసిన అన్ని ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ప్రాసెస్ చేస్తున్నారు. ‌

సిపిసీ 2.0తో ఆదాయ‌పు ప‌న్ను శాఖ సామ‌ర్ధ్యాన్ని విస్త‌రిస్తుంది. ప‌న్ను చెల్లింపుదారుల‌కు ముందుగానే నింపిన ఫార‌మ్‌ల ద్వారా మెరుగైన వేగ‌వంత‌మైన స‌ర్వీసులను అందించమే కాకుండా త‌క్కువ స‌మ‌యంలో వాప‌సుల‌ను చెల్లించ‌నుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని