Gold: దిగుమతి సుంకం ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.1310 పెరిగిన బంగారం ధర
పసిడి ప్రియులకు షాకిస్తూ బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో బులియన్ మార్కెట్లో పుత్తడి ధర ఒక్కసారిగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం 10
దిల్లీ: పసిడి ప్రియులకు షాకిస్తూ బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో బులియన్ మార్కెట్లో పుత్తడి ధర ఒక్కసారిగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.52,200కి చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గడం గమనార్హం. అటు వెండి ధర కూడా రూ.400 పెరిగి కేజీ ధర రూ.59,000 పలికింది.
బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో బులియన్ మార్కెట్లో ఈ లోహం ధర పెరిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ విపణిలో మాత్రం ఈ లోహాల ధరలు క్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1794 డాలర్లు, ఔన్సు వెండి ధర 19.76గా ఉంది.
బంగారంపై దిగుమతి సుంకాన్ని 5శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నేడు వెల్లడించింది. దేశంలో పసిడి దిగుమతులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కరెంట్ ఖాతా లోటును అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పెంపు జులై 30 నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. నిన్నటివరకు పుత్తడిపై ప్రాథమిక దిగుమతి సుంకం 7.5శాతంగా ఉండగా.. తాజా పెంపుతో అది 12.5శాతానికి చేరింది. దీనికి 2.5శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అదనం. దీంతో బంగారంపై దిగుమతి పన్ను 15 శాతానికి చేరింది. ఈ మొత్తానికి 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పెరిగిన దిగుమతి సుంకంతో రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం