Gold Price: ఒక్కరోజే రూ.1,200 పెరిగిన బంగారం ధర.. వెండి పైపైకే..!
ఉక్రెయిన్పై రష్యా సాగిస్తోన్న యుద్ధం నానాటికీ తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయంగా ముడిచమురు, బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా
దిల్లీ: ఉక్రెయిన్పై రష్యా సాగిస్తోన్న యుద్ధం నానాటికీ తీవ్రమవుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు, బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడుతోంది. అంతర్జాతీయ విపణిలో ధరలు పెరగడంతో పాటు, రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశీయంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. బుధవారం దేశ రాజధానిలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా రూ. 1202 పెరిగింది. దీంతో ఈ సాయంత్రం 4 గంటల సమయానికి దిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,889 పలికింది.
అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. నేడు దేశ రాజధానిలో వెండి ధర రూ.2,148 పెరిగి కేజీ ధర రూ.67,956కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1943 డాలర్లుగా, ఔన్సు వెండి ధర 25.18 డాలర్లుగా ట్రేడ్ అయ్యింది. ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం, రూపాయి క్షీణత తదితర కారణాలు బులియన్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM