Google pay: గూగుల్ పేలో లోపం.. ఖాతాల్లోకి ₹80 వేలు..!
Google pay Error: అమెరికాలోని గూగుల్ పే సేవల్లో లోపం తలెత్తింది. దీంతో చాలా మందికి రివార్డుల రూపంలో భారీ మొత్తంలో నగదు జమ అయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్కు చెందిన పేమెంట్ యాప్ గూగుల్ పే (Google pay)లో ఒకప్పుడు భారీగా క్యాష్బ్యాక్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం చాలా మందికి ‘బెటర్ లక్ నెక్ట్స్టైమ్’ అనే సందేశమే వస్తూ ఉంటుంది. అలాంటిది స్క్రాచ్ చేసిన వారిలో కొందరికి రూ.80వేల వరకు ఖాతాల్లో జమ అయ్యాయి. గూగుల్ పేలో చిన్నపాటి లోపం కారణంగా ఈ విధంగా జరిగింది. అయితే ఇది జరిగింది భారత్లో కాదు.. అమెరికాలో!
గూగుల్ పేలో లోపం కారణంగా అమెరికాలోని కొందరు పిక్సల్ ఫోన్ యూజర్లకు భారీగా క్యాష్బ్యాక్లు (Google pay cashback) వచ్చాయి. 10 డాలర్లు మొదలుకొని కొందరికి 1000 డాలర్ల వరకు నగదు క్రెడిట్ అయ్యింది. ఈ విషయాన్ని కొందరు యూజర్లు రెడ్డిట్లో రాసుకొచ్చారు. తాను 16 లావాదేవీలు జరిపితే 10 లావాదేవీలకు క్యాష్బ్యాక్ వచ్చిందని ఓ యూజర్ తెలిపాడు. మరికొందరు తమకు 100 డాలర్లు వచ్చాయని పేర్కొనగా.. మరో యూజర్ తనకు 240 డాలర్లు వచ్చాయని పేర్కొన్నాడు. ఇంకో యూజర్ ఏకంగా 1072 డాలర్లు వచ్చాయని తెలిపాడు. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.80వేల పైమాటే!!
సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో మరికొంతమంది సైతం గూగుల్ పేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, యాప్లోని లోపాన్ని గుర్తించిన గూగుల్ పే వెంటనే దాన్ని సరిచేసింది. యాప్లో సాంకేతిక పరమైన మార్పులు చేసే క్రమంలో ఈ లోపం తలెత్తినట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే, క్యాష్బ్యాక్ అందుకున్న యూజర్ల నుంచి గూగుల్ పే డబ్బులను వెనక్కి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అప్పటికే సంబంధిత ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేసిన వారి విషయంలో మాత్రం ఏమీ చేయలేదని సమాచారం. భారత్లో యూపీఐ రూపంలో గూగుల్పే సేవలందిస్తుండగా.. అమెరికాలో మాత్రం వ్యాలెట్ సేవలందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!