Bard: చాట్జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్.. ఎలా పనిచేస్తుంది?
ChatGPT Vs Bard: చాట్జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్ను సిద్ధం చేస్తోంది. దీన్ని LaMDA ఆధారంగా రూపొందించారు. అంతరిక్ష ఆవిష్కరణలను సైతం ఇది సులభంగా వివరిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు.
న్యూయార్క్: ఆన్లైన్ సమాచార శోధనలో ఏళ్లుగా గూగుల్ (Google) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా దీనికి చాట్జీపీటీ (ChatGPT) రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ సిద్ధమవుతోంది. చాట్జీపీటీ (ChatGPT)తో కృత్రిమ మేధ (AI) రంగంలో మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధానికి గూగుల్ (Google) సైతం తన అస్త్రశస్త్రాలతో సన్నాహాలు చేసుకుంటోంది. ‘బార్డ్ (Bard)’ పేరిట ఏఐ ఆధారిత చాట్బాట్ను సిద్ధం చేస్తోంది.
అంతరిక్ష ఆవిష్కరణలను సైతం సులభంగా
ప్రస్తుతం బార్డ్ (Bard)ను విశ్వసనీయ టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సుందర్ పిచాయ్ సోమవారం ఓ బ్లాగ్ పోస్ట్లో తెలిపారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ ఏడాదిలోనే దీన్ని విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు సైతం బార్డ్ (Bard) చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది. విందు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళిక, ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో ఉన్న కూరగాయల ఆధారంగా భోజనానికి ఏం వండుకోవచ్చు.. వంటి చిట్కాలను సైతం బార్డ్ (Bard) అందించగలుగుతుందని పేర్కొంది. ‘‘సృజనాత్మకత, ఉత్సుకతకు బార్డ్ (Bard) ఓ వేదికగా మారుతుంది’’ అని పిచాయ్ రాసుకొచ్చారు.
అప్రమత్తమై ‘అట్లాస్’తో పరుగులు..
చాట్జీపీటీ (ChatGPT)ని ఓపెన్ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ రూపొందించింది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లోనే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల మరిన్ని నిధులను ఓపెన్ఏఐకి అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన గూగుల్.. బార్డ్ (Bard)కు సంబంధించిన ప్రకటన చేసింది. తమ కంపెనీలో కృత్రిమ మేధపై పనిచేస్తున్న ఇంజినీర్లనూ అప్రమత్తం చేసింది. చాట్జీపీటీ (ChatGPT)కి పోటీనిచ్చేలా బార్డ్ (Bard) అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించింది. అట్లాస్ ప్రాజెక్టు పేరిట గూగుల్ ఈ బార్డ్ (Bard)ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
LaMDA ఆధారంగా...
బార్డ్ (Bard) అనేది చాట్జీపీటీ (ChatGPT) తరహాలోనే కృత్రిమ మేధ ఆధారిత ప్రయోగాత్మక సంభాషణా సేవ. దీన్ని ‘లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ (LaMDA)’ ఆధారంగా రూపొందించారు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు అంతర్జాలం నుంచి తాజా, నాణ్యతతో కూడిన సమాచారాన్ని అందిస్తుంది.
చాట్జీపీటీ, బార్డ్ మధ్య ప్రస్తుతానికి ఇదే తేడా..
చాట్జీపీటీ (ChatGPT)ని విజయవంతం చేయడానికి ఓపెన్ఏఐలోకి మైక్రోసాఫ్ట్ దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. దీన్ని బింగ్ సెర్చ్ ఇంజిన్కు అనుసంధానించే పనిలో ఉంది. దీనికి పోటీగానే బార్డ్ (Bard)ను తీసుకొచ్చారు. ప్రస్తుతం 2021 వరకు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే చాట్జీపీటీ (ChatGPT) సమాధానాలిస్తోంది. కానీ, బార్డ్ (Bard) మాత్రం ఆన్లైన్లో ఉన్న తాజా సమాచారాన్ని ఉపయోగించుకుంటోంది. ఇది బార్డ్కు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చాట్జీపీటీ (ChatGPT) అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంది. చాట్జీపీటీ ప్లస్ పేరిట పెయిడ్ వెర్షన్ కూడా అందిస్తున్నారు. బార్డ్ మాత్రం ఇంకా కొంత మందికే అందుబాటులోకి వచ్చింది. అందరూ దీన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా కొంత సమయం పట్టొచ్చు.
ఇదీ చదవండి: గూగులమ్మకు కొత్త గుబులు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్ను ఎలా సెండ్ చేయొచ్చు. -
108 ఎంపీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు
Infinix Note 40 Pro series: వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ రెండు కొత్త మొబైల్స్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో ఈ ఐకాన్ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్ ఇదే..!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాట్సప్కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. -
గూగుల్ ఫొటోస్ గుడ్న్యూస్.. పిక్సెల్ ఫోన్లలోని ఈ టూల్స్ ఇకపై అందరికీ!
Google Photos: తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్ను అందించనున్నట్లు గూగుల్ ఫొటోస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8, 8ప్రో స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. -
ట్రూకాలర్లో వెబ్ వెర్షన్.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు
ట్రూకాలర్ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. వెబ్ వెర్షన్ను లాంచ్ చేసింది. తద్వారా కొత్త నంబర్లను వెబ్లోనూ వెతకొచ్చు. -
సరైన ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా?.. కొనే ముందు ఇవి తెలుసుకోండి
ఈ వేసవిలో కూలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు ఏమేం చూడాలి? -
బోట్ యూజర్లకు షాక్.. రిస్క్లో 75 లక్షల మంది డేటా
బోట్ వేరియబుల్ బ్రాండ్కు సంబంధించిన యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. 75 లక్షల మంది డేటా లీకైనట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. -
45W ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఎం55.. ₹12 వేలకే ఎం 15
Samsung Galaxy M55: శాంసంగ్ కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో 55 5జీ, 15 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. అమెజాన్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. -
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్తో జియో కొత్త ప్లాన్
Jio Prepaid Plan: జియో రూ.857తో కొత్త ప్లాన్ను ఇటీవల ప్రవేశపెట్టింది. దీంట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ ఉంది. -
హోమ్ రోబోటిక్స్ విభాగంలో యాపిల్..?
Apple: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ హోమ్ రోబోటిక్స్ విభాగంలో అడుగుపెట్టినట్లు బ్లూమ్బర్గ్ ఓ కథనాన్ని ప్రచురింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప