Google: ఫిఫా ఫైనల్ వేళ.. గూగుల్ సరికొత్త రికార్డ్
ఉత్కంఠభరింతంగా సాగిన సాకర్ ప్రపంచకప్ తుది పోరును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ మ్యాచ్ కోసం గూగుల్లో తెగ వెతికేశారట. దీంతో గూగుల్ 25 ఏళ్లలో అత్యధికంగా సెర్చ్ ట్రాఫిక్ను నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ (FIFA World cup 2022)లో ఫ్రాన్స్ (France)ను ఓడించి అర్జెంటీనా (Argentina) జగజ్జేతగా అవతరించింది. ఈ మెగా టోర్నీలో సాకర్ మాంత్రికుడు లియొనెల్ మెస్సీ (Lionel Messi), ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె (Kylian Mbappe) సరికొత్త రికార్డులు సృష్టించారు. అయితే, వీరిద్దరే కాదండోయ్.. సాకర్ తుది సమరం వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) కూడా రికార్డు బద్దలుకొట్టింది. తన 25 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ను నమోదు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు.
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ పోరుపై సుందర్ పిచాయ్ (Sundar Pichai) ట్విటర్లో స్పందించారు. ‘‘ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సమయంలో గూగుల్ సెర్చ్లో తెగ వెతికేశారు. గత 25 ఏళ్లలో అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ రికార్డ్ ఇదే. యావత్ ప్రపంచం కేవలం ఒకే ఒక్క దాని (Fifa Worldcup) కోసం వెతికినట్లుంది’’ అని ఆయన రాసుకొచ్చారు. ఇక నిన్నటి ఫైనల్ మ్యాచ్.. అత్యుత్తమ ఆటల్లో ఒకటిగా నిలిచిందని కొనియాడారు. మెస్సి (Messi) చాలా గొప్పగా ఆడారని ప్రశంసించారు.
ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్లో మెస్సి అరుదైన ఘనత సాధించాడు. ఓ ప్రపంచ కప్లో గ్రూప్ దశ, ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక, ఫిఫా టోర్నీల్లో ఉత్తమ ఆటగాడిగా రెండు సార్లు బంగారు బంతి అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇక ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె.. ఫైనల్లో ఏకంగా మూడు గోల్స్ చేసి ఆశ్చర్యపర్చాడు. ఇప్పటి వరకు జరిగిన ఫిఫా(FIFA) ప్రపంచకప్లలో.. ఫైనల్ మ్యాచ్లో మూడు గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
ఇదిలా ఉండగా సాకర్ ప్రపంచకప్ ఫైనల్ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిఫా, మెస్సి, అర్జెంటీనా, ఎంబాపె పేర్లు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్లో భారత జట్టు లేనప్పటికీ మన దేశంలో ఈ టోర్నీకి వీక్షకాదరణ ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా శోధించిన వాటిల్లో ఫిఫా ప్రపంచకప్ మూడో స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్