Google: గూగుల్ ఉద్యోగులకు స్నాక్స్ బంద్.. ఇతర ప్రోత్సాహకాలూ కట్!
Google: ఉద్యోగులకు ఇచ్చే చిన్న చిన్న ప్రోత్సాహకాలను సైతం గూగుల్ ఆపేసింది. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
వాషింగ్టన్: ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో గూగుల్ (Google) ఎప్పుడూ ముందుంటుంది. అయితే, ఇప్పుడు అవన్నీ కంపెనీకి భారంగా మారాయి. ఇకపై ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాల వంటి వాటిని ఆపేయాలని గూగుల్ నిర్ణయించింది. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కంపెనీ ‘ప్రధాన ఆర్థిక అధికారి (CFO)’ రుత్ పోరట్ ఉద్యోగులకు లేఖ రాశారు.
మరోవైపు ఖర్చులను తగ్గించుకోవడం కోసం కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పోరట్ పేర్కొన్నారు. ప్రాధాన్యానికి అనుగుణంగా.. ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. అందులో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర పనుల్లోకి బదిలీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ల్యాప్టాప్ల కొనుగోలును సైతం తగ్గించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు ఆఫీసులు ఉన్న ప్రాంతాలు.. అక్కడ ఉండే వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే గూగుల్ (Google) భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఇటీవలే 12,000 మందిని ఇంటికి పంపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించేందుకు.. అన్ని పార్టీలు ఏకమై..!
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్లో రకుల్
-
India News
Odisha Train Tragedy: ‘కవచ్ ఉన్నా కాపాడేది కాదు’ : వందేభారత్ రూపకర్త
-
General News
CBI: ఆ రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. 7గంటలపాటు అవినాష్ సీబీఐ విచారణ
-
General News
Andhra News: రైలు ప్రమాదం.. 141 మంది ఏపీ వాసుల కోసం ప్రయత్నిస్తున్నాం: బొత్స
-
Sports News
Sachin: అర్జున్.. నీ ఆటపై శ్రద్ధ పెట్టు.. తనయుడికి సూచించిన సచిన్ తెందూల్కర్