DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ 4 శాతం పెంపు

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Updated : 28 Sep 2022 15:28 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం లభించింది. జులై నుంచి పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ మొత్తం 38 శాతానికి చేరనుంది. ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.

7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం మేర డీఏ పెంచింది. దీంతో మూల వేతనంలో డీఏ 34 శాతానికి చేరింది. తాజా పెంపు నిర్ణయంతో అది 38 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని