Vehicle Scrappage Policy: ప్రతినగరంలో వాహన తుక్కు కేంద్రాల ఏర్పాటే లక్ష్యం
దేశంలోని ప్రతి నగరానికి 150 కి.మీ దూరంలో వాహన తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు....
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన
దిల్లీ: దేశంలోని ప్రతి నగరానికి 150 కి.మీ దూరంలో వాహన తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మొత్తం దక్షిణాసియా ప్రాంతానికి వాహన తుక్కు కేంద్రంగా మారే సత్తా భారత్కు ఉందని తెలిపారు.
దిల్లీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త తుక్కు విధానం భారత రవాణా వ్యవస్థలో ఓ కీలక పరిణామం అని వివరించారు. దీంతో కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలు దశలవారీగా వ్యవస్థ నుంచి తొలగిపోతాయని వివరించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎలాంటి మదుపర్లయినా తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కొత్త విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు.
ప్రధాన తుక్కు కేంద్రాల అభివృద్ధితో పాటు పట్టణాల్లో చిన్న చిన్న అధీకృత సమీకరణ యూనిట్లను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని గడ్కరీ తెలిపారు. వాటికి వాహనాల రిజిస్ట్రేషన్ను రద్దు చేసి డిపాజిట్ చేసుకున్నట్లుగా ధ్రువపత్రం కూడా జారీ చేసే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు నేపాల్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల నుంచి తుక్కు వాహనాలను సేకరించి రీసైకిల్ చేసే అవకాశం భారత్కు ఉందని తెలిపారు.
మెటల్ రీసైక్లింగ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న సంస్థలు ఆదర్శ జిల్లాల్లోనూ తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని గడ్కరీ కోరారు. వాహనాల రీసైక్లింగ్ కోసం తీసుకురాబోతున్న సాంకేతికత ఈ రంగంలో కొత్త శకానికి నాంది పలకనుందని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పన సైతం పెరగనుందని వివరించారు.
స్వచ్ఛంద వాహన తుక్కు విధానం కింద.. 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు; 15 ఏళ్ల తర్వాత వాణిజ్య వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగు పడటంతో పాటు పర్యావరణహిత వాహనాలకు ప్రోత్సాహం లభిస్తుంది. వాహన తుక్కు విధానం కింద పాతది ఇస్తే.. కొత్తదానిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి రోడ్డు ట్యాక్స్పై 25 శాతం రిబేట్ను ఇస్తాయి. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..