Budget 2023: మరో 400 వందే భారత్ రైళ్లు.. రైల్వేకు ఈసారి భారీ బూస్ట్?
Railway Budget 2023: మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ఈసారి బడ్జెట్లో రైల్వేకు పెద్దఎత్తున కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. మరిన్ని వందే భారత్ రైళ్ల గురించి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు రైల్వే బడ్జెట్ (Railway budget) అనగానే.. కొత్త రైళ్లు ఏం ప్రకటిస్తారు? కొత్త లైన్లేంటి? రైళ్లను పొడిగిస్తారా? రేట్లను పెంచుతారా?.. ఇలా రకరకాల అంచనాలు ఉండేవి. ఎప్పుడైతే వేరుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి మోదీ ప్రభుత్వం స్వస్తి పలికిందో ఈ వ్యవహారం చప్పగా మారింది. రైల్వేకు బడ్జెట్ కేటాయింపుల లెక్కలు మాత్రమే ఆర్థిక మంత్రి బడ్జెట్ (Budget-2023) ప్రసంగంలో వినిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో రైల్వే బడ్జెట్పై ఆసక్తి సన్నగిల్లిందనే చెప్పాలి. కానీ, గతేడాది మాత్రం అనూహ్యంగా 400 వందే భారత్ రైళ్లను (Vande bharat Trains) రాబోయే మూడేళ్లలో తీసుకొస్తామన్న ఆర్థిక మంత్రి ప్రకటన రైల్వే బడ్జెట్పై మరోసారి ఆసక్తిని పెంచింది. మరోవైపు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు సైతం వడివడిగా కొనసాగుతున్నాయి. దీంతో ఈసారి రైల్వే శాఖకు ఏ స్థాయిలో కేటాయింపులు జరుపుతారన్నది ఆసక్తిగా మారింది.
వందే ‘భారతం’
మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. 2019లో తొలి వందే భారత్ రైలును ప్రారంభించింది. కొవిడ్ కారణంగా మధ్యలో బ్రేకులు పడినప్పటికీ.. ఇప్పడిప్పుడే ఒక్కో రైలు అందుబాటులోకి వస్తోంది. గతేడాది బడ్జెట్లో 400 వందే భారత్ రైళ్ల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడేళ్లలో వీటిని తీసుకురానున్నట్లు చెప్పారు. అయితే, ఈసారి బడ్జెట్లో మరో 300-400 రైళ్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లతో వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు కేవలం సీటింగ్తోనే నడుస్తున్నాయి. దూర ప్రయాణాలకు అనువుగా స్లీపర్ క్లాస్ వెర్షన్ను తీసుకొచ్చే అంశంపై ఈసారి ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయంగా తయారుచేస్తున్న ఈ రైళ్లను ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలని భారత్ భావిస్తోంది.
‘బుల్లెట్’కు పెరగనున్న కేటాయింపులు
జపాన్ సాయంతో ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 చివరి నాటికి అందుబాటులోకి రావాలి. భూసేకరణ, కొవిడ్ వంటి సమస్యలు ఈ ప్రాజెక్ట్కు విఘాతంగా మారాయి. దీంతో 2026 నాటికైనా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 110 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ను పూర్తి చేయాలంటే.. భారీ కేటాయింపులు జరగాలి. దీనిపై ఈ సారి ప్రకటన ఉండే అవకాశం ఉంది.
₹1.8 లక్షల కోట్లు?
స్వల్పకాలిక లక్ష్యాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పనిచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగా రాబోయే 25 ఏళ్లకు గానూ లక్ష కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేసేందుకు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేగవంతమైన రైళ్లను నడపాలంటే ప్రస్తుతం ఉన్న ట్రాకుల సామర్థ్యం పెంచడంతో పాటు నెట్వర్క్ను విస్తరించడం తప్పనిసరి. దీంతోపాటు ఇప్పటికీ పూర్తికాని విద్యుదీకరణ పనులు పూర్తి చేయడం ప్రభుత్వం ముందున్న లక్ష్యం. 2022-23 బడ్జెట్లో రూ.1.4 లక్షల కోట్ల కేటాయింపులు జరిపారు. ఈసారి బడ్జెట్ను 30 శాతం మేర పెంచి రూ.1.8 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!