Budget 2023: మరిన్ని రంగాలకు పీఎల్ఐ.. బడ్జెట్లో ‘తయారీ’కి దన్ను
Budget 2023: బడ్జెట్ 2023లో తయారీ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా పీఎల్ఐని ఇతర రంగాలకూ విస్తరించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవడం అందులో ఒకటి. ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఉన్న అనేక మార్గాలను అప్పట్లో ప్రభుత్వం శోధించింది. తయారీకి పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ‘ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం (PLI)’ ద్వారా తయారీ రంగానికి ఊతమిచ్చింది. తాజా బడ్జెట్ (Budget 2023)లో పీఎల్ఐని మరిన్ని రంగాలకూ విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
తయారీతోనే ముందుకు..
ఇప్పటి వరకు భారత వృద్ధి కేవలం సేవలరంగంపైనే ఆధారపడినట్లు సర్కార్ గుర్తించింది. తయారీ రంగానికి (Manufacturing Sector) సముచిత ప్రాధాన్యం కల్పించి దేశ వృద్ధి బాటలో భాగం చేయాలని తలచింది. ఈ నేపథ్యంలో జీడీపీ (GDP)లో తయారీ రంగ వాటాను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ క్రమంలో ‘మేకిన్ ఇండియా’ పేరిట 2014లో బృహత్తర ప్రణాళికను ఆవిష్కరించింది. మొత్తం 25 రంగాలకు దీన్ని విస్తరించాలని నిర్ణయించింది.
పీఎల్ఐతో బూస్ట్..
మేకిన్ ఇండియా కింద అనేక పథకాలు తీసుకొచ్చినప్పటికీ.. ‘ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (PLI)’ పథకానికి వచ్చిన స్పందన మరేదానికీ రాలేదు. పీఎల్ఐను మూడు తయారీ రంగాలకు వర్తింపజేస్తూ మార్చి 2020లో ప్రవేశపెట్టారు. సత్ఫలితాలివ్వడంతో మొత్తం 15 రంగాలకు విస్తరించారు. ఇప్పటి వరకు రూ. 1.93 లక్షల కోట్లు విలువ చేసే ప్రోత్సాహకాలను ప్రకటించినట్లు అంచనా. దీంతో వచ్చే ఐదేళ్లలో భారత్ తయారీ కేంద్రంగా అవతరించేందుకు అడుగులు పడుతున్నాయని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పీఎల్ఐకి కలిసొచ్చిన వాతావరణం..
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అనేక అనిశ్చితుల నెలకొన్న తరుణంలో ప్రభుత్వం ఈ పథకాన్ని తెరమీదకు తీసుకురావడం భారత్కు కలిసొచ్చింది. మరోవైపు వస్తు-సేవల కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడడం ఎంత ప్రమాదమో కరోనా సంక్షోభం కళ్లకు కట్టింది. ఈ తరుణంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలూ పీఎల్ఐ విజయవంతమవడానికి దోహదం చేశాయి. ఇప్పటి వరకు పీఎల్ఐ ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్లో 67 శాతం కొత్తతరం రంగాలే కావడం గమనార్హం.
చైనా, తైవాన్, వియత్నాంతో పోలిస్తే భారత్ తయారీలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో తయారీ ఖర్చులు అధికంగా ఉండడం కూడా సవాల్గా నిలుస్తోంది. ఇప్పటి వరకు పీఎల్ఐని వర్తింపజేసిన 15 రంగాల్లో 12 విద్యుత్పై భారీగా ఆధారపడేవే. 10 రంగాల్లో లాజిస్టిక్స్ ఆధారిత ఖర్చులది ప్రధాన వాటా. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్లో ఆయా ఖర్చులను తగ్గించుకునే దిశగా రాయితీలు ఉండాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
బడ్జెట్లో ఇవీ అవసరం..
పీఎల్ఐని మరిన్ని రంగాలకు విస్తరించడంతో పాటు ఈ పథకానికి సవాళ్లుగా నిలుస్తున్న అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తాజా బడ్జెట్ (Budget 2023)లో ఆ దిశగా చర్యలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆటబొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల రంగంలో దిగుమతులను తగ్గించడానికి ఆయా రంగాలకు పీఎల్ఐని విస్తరించాలని సూచిస్తున్నారు. పైగా దేశంలో ఇవి భారీ ఎత్తున ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయని చెబుతున్నారు.
ఆటబొమ్మలు, తోలు పరిశ్రమకు పీఎల్ఐను విస్తరించడంపై ఇప్పటికే జరిగిన చర్చలు తుది దశలో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ (Budget 2023)లో దీనిపై కచ్చితంగా ప్రకటన ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 2022 నాటికి లార్జ్-స్కేల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పీఎల్ఐ కింద రూ. 4,784 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఫలితంగా రూ. 2,03,952 కోట్లు విలువ చేసే ఉత్పత్తి జరిగినట్లు వెల్లడించాయి. దీంట్లో రూ. 80,769 కోట్లు ఎగుమతులేనని తెలిపాయి. ఫాక్స్కాన్, శాంసంగ్, పెగాట్రాన్, రైసింగ్ స్టార్, విస్ట్రోన్, లావా, మైక్రోమాక్స్, ఆప్టిమస్ వంటి బడా కంపెనీలు భారత్లో పీఎల్ఐ కింద పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడుల యాత్ర ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే రాబోయే బడ్జెట్లో పీఎల్ఐకి పెద్దపీట వేయాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం