ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్స్పై కేంద్రం నజర్.. తొలగించేలా నిబంధనలు?
Pre-Installed apps in Smart Phones: గూఢచర్యం, సమాచార తస్కరణ వంటి వాటిని అరికట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు స్మార్ట్ఫోన్లలో ముందే ఇన్స్టాల్ చేసి ఉండే యాప్లను తొలగించేలా నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: స్మార్ట్ఫోన్ల ద్వారా గూఢచర్యం, వ్యక్తిగత సమాచార తస్కరణ ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. స్మార్ట్ఫోన్లలో ముందే ఇన్స్టాల్ చేసి ఉంచుతున్న యాప్ల (pre-installed apps)ను తొలగించేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ ‘రాయిటార్స్’ కథనాన్ని ప్రచురించింది.
ఇదే జరిగితే ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్ (pre-installed apps)ల ద్వారా లబ్ధిపొందుతున్న శాంసంగ్, రెడ్మీ, వివో, యాపిల్, షావోమీ వంటి స్మార్ట్ఫోన్ తయారీ సంస్థల వ్యాపారం దెబ్బతిననుంది. ముందుగానే ఇన్స్టాల్ చేసి ఉంచుతున్న యాప్లే భద్రతాపరంగా ముప్పు తెచ్చిపెడుతున్నట్లు గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. దీన్ని చైనా వంటి విదేశాలు దుర్వినియోగపర్చి దేశ భద్రతకు భంగం కలిగించకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా వ్యాపారాలపై భారత్ నిఘా పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే టిక్టాక్ సహా 300కు పైగా చైనా యాప్లను నిషేధించింది. అలాగే చైనా సంస్థలు భారత్లో చేస్తున్న పెట్టుబడులపైనా తనిఖీలను ముమ్మరం చేసింది. ప్రపంచవ్యాప్తంగానూ వివిధ దేశాలు చైనా రూపొందించిన సాంకేతికతపై ఆంక్షలు విధిస్తున్నాయి. హువావే, హిక్విజన్ వంటి సంస్థల పరికరాలపై నిషేధం విధించాయి. ఎక్కడ వాటిని చైనా గూఢచర్యానికి వాడుకుంటుందోననే అనుమానంతోనే ఆ దిశగా చర్యలు తీసుకున్నాయి.
ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ఫోన్లలో ముందే ఇన్స్టాల్ చేసిన యాప్లు ఉంటున్నాయి. వీటిని డిలీట్ చేయడానికి కుదరదు. ఉదాహరణకు షావోమీ యాప్ స్టోర్ గెట్యాప్స్, శాంసంగ్ పేమెంట్ యాప్ శాంసంగ్ పే, ఐఫోన్లో సఫారీ బ్రౌజర్.. వీటిని ఫోన్ నుంచి తొలగించడం సాధ్యం కాదు. కొత్తగా రూపొందిస్తున్న నిబంధనల ప్రకారం.. ఆయా కంపెనీలు తమ ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ చేసిన యాప్లను తొలగించే ఆప్షన్ను కూడా కస్టమర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్ని కంపెనీలు పాటిస్తున్నాయో, లేదో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ చూస్తుంది. మరోవైపు ఆపరేటింగ్ సిస్టమ్కు ఇచ్చే ప్రతి అప్డేట్కు ముందస్తు తనిఖీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లకు అప్డేట్ను అందించే ముందే ఈ తనిఖీని ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?