రెవెన్యూ కాదు 5జీ ప్రయోజనాలు చూడండి.. స్పెక్ట్రమ్ ఫీజు తగ్గించండి: ఎయిర్టెల్
5జీ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన ఫీజును తక్కువగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని టెలికాం సంస్థ ఎయిర్టెల్ కోరింది.
ముంబయి: 5జీ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన ఫీజును తక్కువగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని టెలికాం సంస్థ ఎయిర్టెల్ కోరింది. రెవెన్యూ కంటే దాని అమలు వల్ల కలిగే ప్రయోజనాలు చూడాలని పేర్కొంది. ఫీజు తక్కువగా ఉన్నప్పుడే టెలికాం కంపెనీలు వేగంగా 5జీ నెట్వర్క్ను అమలు చేయగలవని భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అన్నారు. హెల్త్కేర్ నుంచి వీడియో ఇంటరాక్షన్ వరకు అనేక అప్లికేషన్లు 5జీ సాంకేతికత ద్వారా అందుబాటులోకి రానున్నాయిన చెప్పారు. ఈ మేరకు ఓ ఛానెల్ నిర్వహించిన కాన్క్లేవ్లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
‘‘5జీ సాంకేతికత చాలా ముఖ్యమైనది. 5జీ వస్తే వందలాది సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆ కారణం వల్లే 5జీ స్పెక్ట్రమ్ ఫీజును తక్కువగా ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. టెలికాం పరిశ్రమపై ఒత్తిడి లేకుండా అందుబాటు ధరలో స్పెక్ట్రమ్ను అందివ్వాలని కోరుతున్నాం’’ అని సునీల్ మిట్టల్ అన్నారు. స్పెక్ట్రమ్ పొందడానికి అధిక మొత్తం వెచ్చించే బదులు.. నెట్వర్క్ను వేగంగా తీసుకురావడానికి సర్వీస్ ప్రొవైడర్లు ఖర్చు చేస్తే తక్కువ లేటెన్సీతో హై స్పీడ్ కనెక్టవిటీని అందించడం వీలవుతుందని తెలిపారు. వేలం ద్వారా పొందే రెవెన్యూ కంటే వేగవంతమైన, హైస్పీడ్ నెట్వర్క్ వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని రెట్లు అధికమన్న విషయాన్ని గమనించాలని ప్రభుత్వాన్ని కోరారు.
షెడ్యూల్ ప్రకారమే 5జీ: వైష్ణవ్
5జీకి సంబంధించిన పనులన్నీ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. 5జీకి సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థా ట్రాయ్ ఇటీవల సిఫార్సులు చేసింది. మొబైల్ సేవలకు సంబంధిచిన స్పెక్ట్రమ్ ధరను 39 శాతం తగ్గించాలని ప్రతిపాదించింది. అయితే, దీనిపై టెలికాం అసోసియేషన్ కాయ్ అసంతృప్తి వ్యక్తంచేసింది. స్పెక్ట్రమ్ ధర మరీ ఎక్కువగా ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రిని 5జీ సిఫార్సుల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘కొన్ని వారాలు వేచి చూడండి.. అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది’ అని సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ