వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభం
దేశంలో వాణిజ్య బొగ్గు గనుల రెండో విడత వేలం ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 67 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలానికి ఉంచింది. ‘ఆత్మనిర్భర్
దిల్లీ: దేశంలో వాణిజ్య బొగ్గు గనుల రెండో విడత వేలం ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 67 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలానికి ఉంచింది. ‘ఆత్మనిర్భర్ భారత్’వైపు వేస్తున్న ముందడుగుగా దీన్ని అభివర్ణించింది. వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం దిల్లీలో ప్రారంభించగా.. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అపారమైన బొగ్గు నిల్వలను వినియోగించుకునేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడమేకాక దేశాభివృద్ధికి పాటుపడాలని జోషి కోరారు. వాణిజ్య బొగ్గు మైనింగ్ ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం అవుతుందని చెప్పారు. ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఈ బొగ్గు బ్లాకులు ఉన్నాయి. 2014 ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ స్థాయిలో గనులను వేలానికి ఉంచడం ఇదే తొలిసారి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావు: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే