టిక్‌టాక్‌‌పై నిషేధం: తాజా కబురు తెలుసా?

టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని సమాచారం

Updated : 23 Jan 2021 23:27 IST

దిల్లీ: టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని సమాచారం. నిషేధాజ్ఞలపై మరోసారి సమీక్షించాలని యాప్‌లు కోరగా కుదరదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చిందని కీలక వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై టిక్‌టాక్‌ను సంప్రదించగా ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం వాస్తవమేనని ధ్రువీకరించింది.

‘నోటీసులను కూలంకషంగా పరిశీలిస్తున్నాం. సరైన రీతిలో స్పందిస్తాం. 2020, జూన్‌ 29న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసిన తొలి కంపెనీ టిక్‌టాక్‌. స్థానిక చట్టాలు, నిబంధనలు పాటించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ అభ్యంతరాలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాం. మా వినియోగదారుల గోప్యత, సమాచార భద్రతకు మేం తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని టిక్‌టాక్‌ అధికారి ప్రతినిధి తెలిపారు.

కేంద్రం గతేడాది జూన్‌లో 59, సెప్టెంబర్‌లో 118 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించింది. ఇందులో టిక్‌టాక్‌, హెలో, పబ్‌జీ సైతం ఉన్న సంగతి తెలిసిందే. భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సౌర్వభౌమత్వానికి భంగం కలుగుతోందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రవిశాస్త్రి హెచ్చరిక..
గాయపడ్డా.. బౌలింగ్‌ ఒప్పుకొన్న కారణమదే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు