Honda Elevate: భారత్లో హోండా ఎలివేట్ ఆవిష్కరణ.. 2030 నాటికి 5 కార్లు
Honda Elevate: భారత్లో హోండా ఎలివేట్ ఎస్యూవీని కంపెనీ ఆవిష్కరించింది. దీని ఫీచర్లను కంపెనీ ఈరోజు వెల్లడించింది.
దిల్లీ: జపాన్కు చెందిన వాహన తయారీ సంస్థ హోండా (Honda India) భారత్లో ఐదు కొత్త ఎస్యూవీలను ప్రవేశపెట్టనుంది. 2030 నాటికి వీటిని మార్కెట్లోకి తీసుకొస్తామని మంగళవారం ప్రకటించింది. దీంట్లో ఒకటి విద్యుత్ వాహనం కూడా ఉంటుందని తెలిపింది.
మిడ్- సైజ్ ఎస్యూవీ విభాగంలో తీసుకొస్తున్న ఎలివేట్ (Honda Elevate)ను మంగళవారం హోండా భారత్లో ఆవిష్కరించింది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాతో పోటీ పడనుంది. ఈ కొత్త కారును రాబోయే పండగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. దీని పూర్తిస్థాయి విద్యుత్ మోడల్ను మూడేళ్లలో తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.
భారత్లో ప్రస్తుతం సిటీ, అమేజ్ పేరిట రెండు మోడళ్లను మాత్రమే హోండా (Honda India) విక్రయిస్తోంది. ఇవి రెండూ సెడాన్ విభాగంలోకి వస్తాయి. తాజా ఎలివేట్తో ప్రయాణికుల వాహన విభాగంలో ఎస్యూవీలకు ఉన్న ఆదరణను అందిపుచ్చుకోవాలని హోండా యోచిస్తోంది. ప్రస్తుతం పీవీ విభాగంలో సెడాన్ల వాటా 10 శాతం. ఆ 10 శాతంలోనే హోండా మోడళ్లకు మంచి ఆదరణ ఉందని కంపెనీ సీఈఓ టకుయ సుముర తెలిపారు. అదే ఎస్యూవీలకు 40 శాతం వాటా ఉందని చెప్పారు. పైగా ఏటా ఇది వృద్ధి చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఎస్యూవీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకే ఎలివేట్ను తీసుకొస్తున్నామని తెలిపారు.
ఎలివేట్ (Honda Elevate)లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సహా అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఎలివేట్ను ప్రపంచవ్యాప్తంగా తొలుత భారత్లోనే విడుదల చేస్తోంది. ఒకప్పుడు ప్యాసెంజర్ వెహికల్స్ విభాగంలో మంచి వాటా ఉన్న హోండా.. గత కొన్నేళ్లలో ఆ ప్రభను కోల్పోయింది. మార్కెట్లోకి కొత్త కంపెనీలు రావడమే అందుకు కారణం. తిరిగి పూర్వవైభవాన్ని సొంతం చేసుకునేందుకు హోండా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఎలివేట్ ఫీచర్లు..
- 1.5L i-VTEC DOHC పెట్రోల్ ఇంజిన్తో వస్తున్న ఈ కారు 121 పీఎస్ శక్తిని, 145 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
- 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ సీవీటీ ట్రాన్స్మిషన్ వ్యవస్థను అమర్చారు.
- ఆరు ఎయిర్బ్యాగ్లు, ఈబీడీ బ్రేక్ అసిస్ట్తో కూడిన ఏబీఎస్, హోండా లేన్ వాచ్ కెమెరా, లైట్ క్రాష్ పెర్ఫార్మెన్స్, మల్టీ యాంగిల్ రియర్ కెమెరా, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
- 458 లీటర్ కార్గో స్పేస్ ఉంది.
- 26.03 సెం.మీ ఇన్ఫోటైన్మెంట్ ఉంది. స్మార్ట్ఫోన్లను వైర్లెస్గా దీనికి కనెక్ట్ చేయొచ్చు. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెబ్లింక్, బ్లూటూత్, యూఎస్బీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా సబ్స్క్రీన్ సెక్షన్లు కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?