Air India deal: ఎయిర్ ఇండియా డీల్ అంత పెద్దదా..!
ఎయిర్ ఇండియా ప్రకటించిన విమాన కొనుగోలు డీల్ ప్రపంచ వైమానిక రంగంలో ఓ సంచలనంగా నిలిచింది. ఇది భారత్ను వివిధ మార్గాల్లో బలోపేతం చేయనుంది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఉద్యోగుల జీతాల బకాయిలు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలతో ఏడాది క్రితం వరకు ఎయిర్ ఇండియా వార్తల్లో నిలిచింది.. కానీ, టాటాలు ఆ సంస్థను తిరిగి దక్కించుకోవడంతో దాని దశ మారిపోయింది. ఇటీవలే వైమానిక రంగంలోనే ఓ అతిపెద్ద డీల్ను ప్రకటించింది. దాని విలువ సుమారు 70 బిలియన్ డాలర్లు. ఇది కొన్ని దేశాల జీడీపీ కంటే చాలా ఎక్కువ. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ డీల్ దేశ పౌరవిమానయాన రంగాన్ని సమూలంగా మార్చడంతో పాటు.. అంతర్జాతీయ వేదికపై భారత్ హోదాను పెంచనుంది.
పెరగనున్న భారత్ పరపతి..
అమెరికా, పశ్చిమ దేశాలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అంశం వ్యాపారం. ఈ దేశాలు వ్యాపారం కోసం తీవ్రంగా పోటీపడతాయి. ఆస్ట్రేలియా నుంచి ఫ్రాన్స్కు దక్కిన 40 బిలియన్ డాలర్ల విలువైన సబ్మెరైన్ల డీల్ను అమెరికా, యూకే కలిసి ‘ఆకస్’ ఒప్పందం పేరట తన్నుకుపోయాయి. దీంతో ఫ్రాన్స్ ఆ దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా దేశాల మధ్య ఏ స్థాయిలో పోటీ ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. వైమానిక రంగంలో బోయింగ్(అమెరికా), ఎయిర్ బస్(ఫ్రాన్స్) అతిపెద్ద కంపెనీలు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొవిడ్, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం దెబ్బకు వైమానిక రంగం కుదేలైపోయింది.
బోయింగ్ ఈ నెల మొదట్లోనే 2,000 మంది హెచ్ఆర్, ఫైనాన్స్ ఉద్యోగులను తొలగించింది. గత రెండేళ్లలో ఎయిర్ బస్ కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను సాగనంపింది. దీనికి తోడు అతి పెద్దదైన చైనా మార్కెట్ నుంచి ఈ సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో భారత్ వాటికి ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఒక్క రోజులో ఎయిర్ ఇండియా ఈ రెండు కంపెనీల నుంచి 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో బిలియన్ల కొద్దీ డాలర్లు ఈ కంపెనీలకు అందనున్నాయి. 2013లో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ బోయింగ్కు ఇచ్చిన 76 బిలియన్ డాలర్ల ఆర్డర్ తర్వాత ఇదే అతిపెద్దది. దాదాపు పదేళ్ల క్రితం అమెరికన్ ఎయిర్లైన్స్ కూడా ఇటువంటి భారీ కొనుగోలు చేపట్టింది.
దేశాధినేతలకూ కొంత ఊరట..
వచ్చే సంవత్సరం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇది బైడెన్ సర్కార్కు అగ్ని పరీక్షే. ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వం వడ్డీ రేట్లను కూడా పెంచుతూ పోతోంది. దీంతో అక్కడ వ్యాపారాలకు నగదు లభ్యత తగ్గిపోతోంది. ఫలితంగా చాలా సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల తొలగింపును మొదలుపెట్టాయి. బైడెన్ ఆర్థిక విధానాలు కూడా పేలవంగా ఉండటం పరిస్థితిని దిగజార్చింది. వీటిని ప్రత్యర్థులు బైడెనోమిక్స్ అని ఎద్దేవా చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఏకంగా 44 రాష్ట్రాల్లో 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే డీల్ను భారత్ సంస్థ అందించడం బైడెన్ సర్కారుకు కచ్చితంగా ఊరటనిచ్చే అంశం. మరోవైపు బ్రిటన్ ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. రిషి సునాక్ వచ్చినా ఆ దేశ ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ఈ సమయంలో భారత్ నుంచి 68 విమాన ఇంజిన్ల కాంట్రాక్టు బ్రిటన్కు చెందిన రోల్స్రాయిస్కు దక్కింది. అన్నింటికి మించి రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ తటస్థంగా ఉంది. దీనిపై పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో రష్యాతో బంధం కొనసాగిస్తూనే.. తాజా డీల్తో పశ్చిమదేశాలతో తమ సంబంధాలు పదిలంగానే ఉన్నాయని బలమైన సంకేతాలను పంపినట్లైంది. దీంతో ఒక్క చైనా మినహా.. ఐరాస భద్రతా మండలిలో వీటో హక్కున్న అన్ని దేశాలతో భారత్ మంచి సంబంధాలను నెరుపుతున్నట్లైంది.
ప్రపంచ స్థాయి వైమానిక సేవలు..
ప్రస్తుతం భారత్ రైళ్లలో ప్రతిరోజూ ప్రయాణిస్తున్న 23 మిలియన్ల మందిలో ఒక్కశాతం మంది భవిష్యత్తులో విమానాల వైపు మొగ్గినా.. మార్కెట్ భారీగా పెరగనుంది. ఎయిర్బస్ గతేడాది వెలువరించిన అంచనాల ప్రకారం భారత్కు వచ్చే 20 ఏళ్లలో 2,210 విమానాలు అవసరం. బోయింగ్ అంచనాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. వీటిల్లో ఐదో వంతుకుపైగా విమానాలను తాజాగా ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటాల పరిధిలోకి రాగానే దూకుడు పెరిగింది. ఎమిరేట్స్, కతర్ ఎయిర్వేస్ నుంచి ట్రాఫిక్ను దక్కించుకోవడానికి ఎయిర్ ఇండియా పోటీపడుతుందని వైమానిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ నుంచి దుబాయ్, దోహాలకు వెళ్లి అక్కడి నుంచి అమెరికా, ఐరోపా దేశాలకు ప్రయాణిస్తుంటారు. తాజా డీల్తో ఇంధనాన్ని పొదుపుగా వాడే విమానాలు ఎయిర్ ఇండియా చేతికి అందనున్నాయి. కొత్త విమానాల రాకతో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు నాన్స్టాప్ సర్వీసులను అందించడంపై ఎయిర్ ఇండియా దృష్టిపెట్టనుంది. ఇవి చాలా లాభదాయకమైన వైమానిక మార్గాలు. దేశీయంగా ఇండిగో ఎయిర్లైన్స్కు బలమైన పోటీ ఇవ్వనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?