ఈ సారి ఆరోగ్యమే మహాభాగ్యం..!
కరోనా వైరస్ ఈ సారి బడ్జెట్ స్వరూపాన్నే పూర్తి మార్చేయనుంది. ఈ సారి ప్రభుత్వ ప్రణాళికలో వైద్య, ఆరోగ్యరంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇప్పటికే మోదీ పలు మార్లు తన ప్రాధాన్యాల్లో..
ఇంటర్నెట్డెస్క్: కరోనా వైరస్ ఈ సారి బడ్జెట్ స్వరూపాన్నే పూర్తి మార్చేయనుంది. ఈ సారి ప్రభుత్వ ప్రణాళికలో వైద్య, ఆరోగ్యరంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇప్పటికే మోదీ పలు మార్లు తన ప్రాధాన్యాల్లో కొవిడ్ నివారణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. దానికి తగ్గట్లే ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన టీకాల కార్యక్రమం మొదలైంది. 2021లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆర్థిక వృద్ధికి అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
కొవిడ్ మహమ్మారి మన వైద్య-ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను బయటపెట్టింది. ముఖ్యంగా మహమ్మారులు ప్రబలినప్పుడు ఎదుర్కొనేలా ప్రజారోగ్య వ్యవస్థన పటిష్ఠపర్చాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఈ నేపథ్యంలో జీడీపీలో కనీసం 2.5శాతం దీనికి కేటాయించాలి. దీంతోపాటు ప్రభుత్వ -ప్రైవేటు రంగాలు సంయుక్తంగా ప్రజారోగ్యానికి కృషి చేసేలా వ్యవస్థలను సిద్ధం చేయాలి. ఇలాంటి లక్ష్యాలను అందుకోవడానికి ది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ వంటి కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 2020 బడ్జెట్లో దీనికి సంబంధించిన పునాదులు వేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలను కూడా డిజిటల్ మార్గంలో వైద్యకేంద్రాలకు అనుసంధానించి సేవలు అందించే ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పాలసీలను సిద్ధం చేయడంతోపాటు నిధులను సమకూర్చాల్సి ఉంది. ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చు. కొవిడ్ వారియర్లుగా పనిచేసిన వైద్య సిబ్బంది రక్షణకు కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
కొరతలు తీర్చాలి..
కరోనా వైరస్ వ్యాపించిన తొలినాళ్లలో దేశంలో వైద్యసౌకర్యాల కొరత తీవ్రంగా ఉండేది. ఒక దశలో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. దీంతో రోగులను ఇళ్లలోనే ఉంచి చికిత్స చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో ఆసుపత్రులు, పీహెచ్సీల్లో వైద్య సదుపాయాలను మరింత పెంచాలి. ఇక టీకాలు వేయించుకోవడానికి కేంద్రం ఎంత ప్రోత్సహిస్తే ఆర్థిక వ్యవస్థ అంతవేగంగా పుంజుకొంటుంది. ఇందుకోసం ప్రభుత్వం టీకాలపై రాయితీలు ఇచ్చేందుకు నిధులను కేటాయించాలి. ఇక దీర్ఘకాల ప్రయోజనాల విషయానికి వస్తే వైద్య పరిశోధనలు.. వాటికి అవసరమైన పరికరాలు, ఆసుపత్రులపై పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఇవి వెంటనే ఫలితాలు ఇవ్వకపోయినా.. దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం పడుతుంది.
ఎవియాన్ ఫ్లూ, సార్స్, మెర్స్, ఎబోలో ఇలా ఇటీవల కాలంలో చాలా వ్యాధులు ప్రభుత్వాల శక్తిని ప్రశ్నార్థకం చేశాయి. ఇటీవల కాలంలో బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్లు కూడా మందులను తట్టుకొనేలా సమర్థవంతంగా మార్పులు చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ-ప్రైవేటు రంగాలు కలిసి సమర్థంగా ముందుకు వెళ్లేలా పాలసీలు తయారు చేయాలి. ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని దిగ్గజ సంస్థలను లైఫ్సైన్సెస్, డయాగ్నస్టిక్స్ వైపు వచ్చేలా ఇవి ఉండాలి.
పరీక్షా కేంద్రాలకు అవసరమైన వసతులు కల్పించి.. భవిష్యత్తులో ఎదురయ్యే వైద్యపరమైన ముప్పులను తట్టుకోవడానికి సిద్ధపడాలి.
తాజాగా వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా.. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలకు ఇవి కేంద్రాలుగా మారాలి. ప్రభుత్వం వీటిపై పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావించాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు