వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు వర్తిస్తుందా?
వివిధ పెట్టుబడులపై లభించే వడ్డీ ఆదాయంపై పన్ను ఏవిధంగా వర్తిస్తుందో తెలుసుకుని పెట్టుబడులు చేయడం మంచింది
పెట్టుబడులపై వచ్చే నికర ఆదాయంపై పన్ను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా అత్యధిక పన్ను పరిధిలోకి వచ్చే పెట్టుబడిదారులు పన్నులపై దృష్టిపెట్టాలి. ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిర్ధిష్ట పథకాలపై మినహాయింపు కల్పిస్తుంది. మరి పెట్టుబడులు చేసే ముందు ఆయా పథకాలపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు వర్తిస్తుందా? లేదా? తెలుసుకోవాలి. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు వర్తించేందుకు అర్హత ఉన్న అన్ని పెట్టుబడులకు ఆదాయపు పన్ను-ఈఈఈ మినహాయింపు ప్రయోజనం వర్తించదని గుర్తించుకోవాలి. వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను ఏవిధంగా వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం.
పొదుపు ఖాతాపై పన్ను:
బ్యాంకు పొదుపు ఖాతా నుంచి వచ్చే వడ్డీని ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంగా లెక్కిస్తారు. పన్ను చెల్లింపుదారుడు, అతనికి వర్తించే స్లాబ్ను అనుసరించి పన్ను చెల్లించాలి. అయితే సెక్షన్ 80టీటీఏ ప్రకారం ఒక సంత్సరంలో వడ్డీ ఆదాయం రూ.10వేల వరకు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.10 వేల కంటే ఎక్కువ వడ్డీ పొందితే దానిపై పన్ను వర్తిస్తుంది. ఇక్కడ బ్యాంకులు, కో-ఆపరేటీవ్ బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి అన్ని రకాల పొదుపు ఖాతాలపై వచ్చిన వడ్డీని కలిపి పరిగణలోకి తీసుకుంటారు.
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు:
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయంగా పరిగణించి, వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. వడ్డీ ఆదాయాన్ని ఖాతాకు జమ చేసే సమయంలో మూలం వద్ద పన్ను(టీడీఎస్) కూడా వర్తిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్):
పీపీఎఫ్, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అంతేకాకుండా మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై కూడా పన్ను వర్తించదు. ఈ పథకంపై ఈఈఈ పన్ను ప్రయోజనం ఉంటుంది.
జాతీయ పొదుపు సర్టిఫికేట్(ఎన్ఎస్సీ)
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద ఎన్ఎస్సీలో పెట్టుబడులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎన్ఎస్సీలో వార్షికంగా వడ్డీ లభిస్తుంది. అయితే ఈ ఆదాయాన్ని తిరిగి పెట్టుబడి పెడతారు. అందువల్ల వార్షిక ఆదాయంపై పన్ను వర్తించదు. అయితే మెచ్యూరిటీ సమయంలో వచ్చే ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయంగా పరిగణించి, ఆయా వ్యక్తులకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్కు లోబడి పన్ను విధిస్తారు.
కిసాన్ వికాస్ పత్రా(కేవీపీ):
కేవీపీలో పెట్టుబడి పెట్టిన మొత్తం 10.4 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అయితే ఈ పథకంలో ఎటువంటి పన్ను రాయితీలు ఉండవు. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించి, మెచ్యూరిటీ సమయంలో వచ్చే వడ్డీ ఆదాయంపై, ఆయా వ్యక్తుల పన్ను స్లాబులను అనుసరించి వడ్డీ విధిస్తారు. సెక్షన్ 80 సీ కింద ఎటువంటి మినహాయింపులు వర్తించవు.
సుకన్య సమృద్ధి యోజన:
పీపీఎఫ్ మాదిరిగానే సుకన్య సమృద్ధి యోజన కూడా ప్రభుత్వం అందించే ముఖ్యమైన పెట్టుబడి మార్గం. ఈ పథకం ఆడపిల్లల కోసం మాత్రమే ఉద్దేశించింది. దీనిపై కూడా పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులపై, వడ్డీఆదాయం, మెచ్యూరిటీ మొత్తాలపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు. సెక్షన్ 80సీ ప్రకారం పెట్టుబడులపై కూడా మినహాయింపు పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్