LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులా..? ఐపీవోలో పాల్గొనాలంటే ఏం చేయాలి?
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ త్వరలో ఐపీవోకు రానుంది. మరి ఐపీవోలో పాల్గొనాలంటే ఏమేం కావాలి..?
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ త్వరలో ఐపీవోకు రానుంది. జీవిత బీమా రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన ఈ సంస్థ ఐపీవోలో పాలసీదారులు కూడా పాల్గొనే సదుపాయం ప్రభుత్వం కల్పిస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారితో పాటు, పాలసీదారుల్లో కూడా ఈ ఐపీవోలో పాల్గొనాలన్న ఉత్సుకత నెలకొంది. మరి ఐపీవోలో పాల్గొనాలంటే ఏమేం కావాలి..?
పాన్ లింక్ చేశారా?
ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనాలంటే ముందుగా మీ పాలసీ అకౌంట్తో పాన్ను లింక్ చేయాలి. ఎల్ఐసీ రికార్డుల్లో మీ పాన్ అప్డేట్ అయితేనే ఐపీవోలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఇది వరకే ఎల్ఐసీ వెల్లడించింది. అందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
- తొలుత https://licindia.in/Home/Online-PAN-Registration లింక్ క్లిక్ చేసి ఎల్ఐసీ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- అక్కడ మీ పాలసీ నంబర్, పుట్టిన తేదీ, పాన్ వివరాలు నమోదు చేయాలి.
- క్యాప్చా కోడ్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
- తర్వాత మళ్లీ ఓ సారి ఎల్ఐసీ పాలసీకి, పాన్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి.
డీమ్యాట్ ఖాతా ఉందా..?
పాలసీతో పాన్ నంబర్ లింక్ చేసిన తర్వాత మీకు కావాల్సింది డీమ్యాట్ ఖాతా. ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉంటే పర్లేదు.. లేదంటే కొత్తగా తెరవాల్సిందే. ఈక్విటీ మార్కెట్లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. వీటిని NSDL, CDSL నిర్వహిస్తుంటాయి. ఆధార్, పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రం వంటి వివరాలతో డీమ్యాట్ ఖాతాను తెరవొచ్చు. అప్పుడే మీరు ఐపీవోలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.
మరిన్ని పెరగనున్న డీమ్యాట్ ఖాతాలు
స్టాక్ మార్కెట్లో కొన్నేళ్లుగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొవిడ్ వేళ ఈ సంఖ్య మరింత పెరిగింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఎల్ఐసీ ఐపీవోకు వస్తుండడంతో ఇది వరకే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారితోపాటు సగటు పాలసీదారులు సైతం ఐపీవోకు సన్నద్ధమవుతున్నారు. 10 శాతం షేర్లు పాలసీదారులకు కేటాయిస్తామమని ప్రభుత్వం పేర్కొనడంతో వారు సైతం ఐపీవోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉండగా.. ఎల్ఐసీ ఐపీవో కారణంగా ఈ సంఖ్య భారీగానే పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్