International Girl Child Day: మీ చిన్నారి భవితకు SSYతో భరోసానివ్వండి!
సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడులతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఎంత మొత్తం కూడబెట్టచ్చో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని 2015లో 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు తమ చిన్నారుల భవిష్యత్ (ఉన్నత చదువులు, వివాహం) కోసం పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో 9.20% వరకు కూడా వడ్డీ రేటును ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం వార్షికంగా 7.60% మాత్రమే వడ్డీ లభిస్తోంది. అయినప్పటికీ, రాబడి ద్రవ్యోల్బణాన్ని మించి ఉంది. అదే విధంగా పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు తమ చిన్నారుల భవితకు భరోసా కల్పించేందుకు ఈ పథకంలో మదుపు చేయవచ్చు.
పాప భవిష్యత్తు కోసం ఎంత వరకు కూడబెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం..
మీ పాప 2020లో పుట్టింది.. మీరు అదే సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఏడాదికి రూ.1 లక్ష పెట్టుబడి పెడుతున్నారనుకుందాం. మెచ్యూరిటీ పూర్తయ్యే నాటికి మీరు పెట్టుబడి పెట్టే మొత్తం ఎంత? ఎంత రాబడి వస్తుంది? ఆ వివరాలను విపులంగా తెలుసుకుందాం.
-
మీ పాప పుట్టిన ఏడాదిలోనే పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి పాపకు 22 సంవత్సరాలు వచ్చేసరికి మెచ్యూరిటీ మొత్తం చేతికి అందుతుంది.
-
పెట్టుబడి మొత్తం.. వార్షికంగా రూ.1,00,000
- పెట్టుబడులు పెట్టే కాలవ్యవధి..15 సంవత్సరాలు
- 15 ఏళ్లలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తం..రూ. 15,00,000 ( ఏడాదికి రూ.1 లక్ష చొప్పున)
- ఎస్ఎస్వై ప్రస్తుత వడ్డీ రేటు..7.60% (వార్షికంగా)
- లభించే వడ్డీ మొత్తం..రూ. 28,95,381
- మెచ్యూరిటీ మొత్తం..రూ. 43,95,381
గమనిక: పై పట్టికలో ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60% చొప్పున మెచ్యూరిటీ మొత్తాన్ని లెక్కించాం.
ఒక వేళ మీరు పథకంలో అందుబాటులో ఉన్న గరిష్ఠ పరిమితి వరకు పెట్టుబడి పెట్టగలిగితే ఎంత సమకూర్చుకోగలుగుతారంటే..?
- పెట్టుబడి మొత్తం..వార్షికంగా రూ. 1,50,000
- పెట్టుబడులు పెట్టే కాలవ్యవధి..15 సంవత్సరాలు
- 15 ఏళ్లలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తం..రూ. 22,50,000 ( ఏడాదికి రూ.1,50,000 చొప్పున)
- ఎస్ఎస్వై ప్రస్తుత వడ్డీ రేటు..7.60% (వార్షికంగా)
- లభించే వడ్డీ మొత్తం..రూ. 43,43,068
- మెచ్యూరిటీ మొత్తం..రూ. 65,93,071
చివరిగా: 10 ఏళ్ల లోపు ఆడపిల్లల తల్లిదండ్రులు తమ చిన్నారుల భవిష్యత్ కోసం ఇందులో పెట్టబడులు పెట్టవచ్చు. తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఖాతా బ్యాలెన్సు నుంచి 50 శాతం వరకు తీసుకోవచ్చు. అలాగే, వివాహ సమయంలో (నిబంధనలకు లోబడి) గానీ, 21 ఏళ్ల మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత గానీ పూర్తి మొత్తాన్ని ఖాతా నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వం అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అధిక రాబడి ఇస్తున్న పథకం ఇది. అలాగే, ఈ ఖాతాలో పెట్టుబడులపై ‘ఈఈఈ’ కేటగిరీలో పన్ను ప్రయోజనం లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి -
పన్ను ప్రణాళికకు తరుణమిదే..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు -
రెస్టరంట్లో డబ్బు ఆదా చేయడానికి చిట్కాలు
ఎప్పుడైనా కుటుంబంతో కలిసి రెస్టరంట్కు వెళ్లాలనుకునేవారు బిల్లుపై తగ్గింపు పొందాలనుకుంటారు. అలాంటి వారికోసమే కొన్ని చిట్కాలు. -
ఆన్లైన్ vs ఆఫ్లైన్ బీమా.. ఏది మెరుగైనది?
ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్లైన్, ఆఫ్లైన్లో లభిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఎలా మెరుగైనవి అనేది ఇక్కడ తెలుసుకోండి. -
ఎన్పీఎస్ లాగిన్, క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..
Changes from april 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో చూసేయండి.. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!