
PPF: పీపీఎఫ్తో ₹1 కోటి సమకూర్చుకోవాలంటే.. నెలకు ఎంత మదుపు చేయాలి?
ఇంటర్నెట్ డెస్క్: ప్రజా భవిష్య నిధి (PPF).. 100 శాతం నష్టభయం లేని పథకం. దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేసే వారికి సరిగ్గా సరిపోతుంది. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. ప్రస్తుతం వార్షికంగా 7.10 శాతం వడ్డీ అందిస్తోంది.
పీపీఎఫ్ ఖాతాకు 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. అయితే, 15 సంవత్సరాల తర్వాత కూడా ఐదేళ్ల చొప్పున ఎన్నిసార్లైనా ఖాతాను పొడిగించుకోవచ్చు. మదుపర్లు తెలివిగా ఒక ప్రణాళిక ప్రకారం పీపీఎఫ్లో మదుపు చేస్తే.. కాలపరిమితి పొడిగింపు ప్రయోజనాన్ని ఉపయోగించుకుని విత్డ్రా చేసుకునే సమయానికి రూ.కోటి సమకూర్చుకోవచ్చు. దీనికి క్రమశిక్షణతో పెట్టుబడులు చేయడం అవసరం.
సాధారణంగా పీపీఎఫ్లో నెల నెలా.. 3 నెలలు, 6 నెలలు, ఏడాదికోసారి డిపాజిట్ చేయవచ్చు. లేదా ఏడాదికి కనీసం మొత్తం రూ.500 డిపాజిట్ చేసి ఖాతాను నిర్వహించవచ్చు. అయితే, కోటి రూపాయల పెద్ద మొత్తం కావాలంటే పెట్టుబడులు చేసే పీపీఎఫ్ ఖాతాదారులు తాము ఎంచుకున్న ప్రకారం సమయానుసారం మదుపు చేయాల్సి ఉంటుంది. పాక్షిక విత్డ్రాలు, రుణాల జోలికి పోకూడదు.
పీపీఎఫ్ ఖాతాలో మదుపర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నియమాన్ని అనుసరించి రూ.1 కోటి సమకూర్చుకునేందుకు ఎన్ని సంవత్సరాలు పీపీఎఫ్ ఖాతాను కొనసాగించాలో ఇప్పుడు చూద్దాం. వార్షికంగా పీపీఎఫ్లో అనుమతించిన గరిష్ఠ పరిమితి మేరకు, అంటే ఏడాదికి రూ.1.50 లక్షలు పెట్టుబడిపెట్టేవారు రూ.1 కోటి కోసం 25 సంవత్సరాలు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది.
డిపాజిట్ ఇలా..
గమనిక: పై పట్టికలో కోటి రూపాయిలు సమకూర్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో పాఠకుల అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత 20, 25, 30, 35.. ఇలా 5 సంవత్సరాల చొప్పున పెట్టుబడులను కొనసాగించాలి. నెలకు రూ.12,500 పెట్టుబడి పెట్టేవారు 25 సంవత్సరాల వరకు; నెలకు రూ.12,000 నుంచి రూ.8,500 వరకు పెట్టుబడి పెట్టేవారు 30 సంవత్సరాల వరకు; రూ.8000 నుంచి రూ.6000 పెట్టుబడి పెట్టేవారు 35 ఏళ్ల పాటు (మధ్యలోనే రూ.1 కోటి సమకూరినప్పటికీ) పెట్టుబడులను కొనసాగించాలి.
15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత పీపీఎఫ్ ఖాతాను కొనసాగించాలనుకునే వారు పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత 15వ సంవత్సరం ఐదేళ్ల కొనసాగింపు కోసం కావాల్సిన ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత నుంచి ప్రతి 5వ సంవత్సరం కొనసాగింపు కోసం ఫారం సమర్పించవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten news @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Business News
New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
-
General News
Telangana News: టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు
-
Movies News
Sita Ramam: ఇట్లు.. నీ భార్య సీతామహాలక్ష్మీ.. హృద్యంగా ‘సీతారామం’ టీజర్
-
Politics News
Andhra News: ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
Business News
BSNL: బ్రాడ్బ్యాండ్ ప్లాన్ తీసుకుంటున్నారా?ఈ BSNL ప్యాక్పై లుక్కేయాల్సిందే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- Super Tax: పాక్లో ‘సూపర్’ పన్ను!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు