PPF: పీపీఎఫ్తో ₹1 కోటి సమకూర్చుకోవాలంటే.. నెలకు ఎంత మదుపు చేయాలి?
PPF: పీపీఎఫ్ ఖాతాలో మదుపర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజా భవిష్య నిధి (PPF).. 100 శాతం నష్టభయం లేని పథకం. దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేసే వారికి సరిగ్గా సరిపోతుంది. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. ప్రస్తుతం వార్షికంగా 7.10 శాతం వడ్డీ అందిస్తోంది.
పీపీఎఫ్ ఖాతాకు 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. అయితే, 15 సంవత్సరాల తర్వాత కూడా ఐదేళ్ల చొప్పున ఎన్నిసార్లైనా ఖాతాను పొడిగించుకోవచ్చు. మదుపర్లు తెలివిగా ఒక ప్రణాళిక ప్రకారం పీపీఎఫ్లో మదుపు చేస్తే.. కాలపరిమితి పొడిగింపు ప్రయోజనాన్ని ఉపయోగించుకుని విత్డ్రా చేసుకునే సమయానికి రూ.కోటి సమకూర్చుకోవచ్చు. దీనికి క్రమశిక్షణతో పెట్టుబడులు చేయడం అవసరం.
సాధారణంగా పీపీఎఫ్లో నెల నెలా.. 3 నెలలు, 6 నెలలు, ఏడాదికోసారి డిపాజిట్ చేయవచ్చు. లేదా ఏడాదికి కనీసం మొత్తం రూ.500 డిపాజిట్ చేసి ఖాతాను నిర్వహించవచ్చు. అయితే, కోటి రూపాయల పెద్ద మొత్తం కావాలంటే పెట్టుబడులు చేసే పీపీఎఫ్ ఖాతాదారులు తాము ఎంచుకున్న ప్రకారం సమయానుసారం మదుపు చేయాల్సి ఉంటుంది. పాక్షిక విత్డ్రాలు, రుణాల జోలికి పోకూడదు.
పీపీఎఫ్ ఖాతాలో మదుపర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నియమాన్ని అనుసరించి రూ.1 కోటి సమకూర్చుకునేందుకు ఎన్ని సంవత్సరాలు పీపీఎఫ్ ఖాతాను కొనసాగించాలో ఇప్పుడు చూద్దాం. వార్షికంగా పీపీఎఫ్లో అనుమతించిన గరిష్ఠ పరిమితి మేరకు, అంటే ఏడాదికి రూ.1.50 లక్షలు పెట్టుబడిపెట్టేవారు రూ.1 కోటి కోసం 25 సంవత్సరాలు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది.
డిపాజిట్ ఇలా..
గమనిక: పై పట్టికలో కోటి రూపాయిలు సమకూర్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో పాఠకుల అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత 20, 25, 30, 35.. ఇలా 5 సంవత్సరాల చొప్పున పెట్టుబడులను కొనసాగించాలి. నెలకు రూ.12,500 పెట్టుబడి పెట్టేవారు 25 సంవత్సరాల వరకు; నెలకు రూ.12,000 నుంచి రూ.8,500 వరకు పెట్టుబడి పెట్టేవారు 30 సంవత్సరాల వరకు; రూ.8000 నుంచి రూ.6000 పెట్టుబడి పెట్టేవారు 35 ఏళ్ల పాటు (మధ్యలోనే రూ.1 కోటి సమకూరినప్పటికీ) పెట్టుబడులను కొనసాగించాలి.
15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత పీపీఎఫ్ ఖాతాను కొనసాగించాలనుకునే వారు పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత 15వ సంవత్సరం ఐదేళ్ల కొనసాగింపు కోసం కావాల్సిన ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత నుంచి ప్రతి 5వ సంవత్సరం కొనసాగింపు కోసం ఫారం సమర్పించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్