Pension: నెలకు ₹12 వేలతో ₹2లక్షల వరకు పెన్షన్..!
ఈక్విటి, డెట్ కలయికతో ఎన్పీఎస్ నుంచి దీర్ఘకాలంలో వార్షికంగా దాదాపు 10% రాబడి ఆశించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ప్రభుత్వ మద్దతు గల సామాజిక భద్రతా పథకం. మదుపర్లు ఈ పథకం ద్వారా ఒకేసారి ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాదారుడు 75% వరకు పెట్టుబడులను ఈక్విటీల్లో పెట్టబడి పెట్టే వీలుంది. మిగిలిన 25% శాతం మాత్రం డెట్లో ఉంచాలి. అయితే ఈక్విటీ, డెట్ పెట్టుబడులను 60:40 నిష్పత్తిలో, 50:50 నిష్పత్తిలో గానీ దీర్ఘకాలంలో ఉంచడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందొచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఈక్విటీ, డెట్ కలయికతో ఎన్పీఎస్ నుంచి దీర్ఘకాలంలో వార్షికంగా దాదాపు 10% రాబడి ఆశించవచ్చు. అలాగే ఎన్పీఎస్ (NPS) పెట్టుబడులపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు.
10% రాబడి ఎలా?
ఎన్పీఎస్ (NPS) పెట్టుబడులపై ఈక్విటీల నుంచి దీర్ఘకాలంలో దాదాపు 12%, డెట్ నుంచి కనీసం 8% రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మదుపరి 50:50 రేషియో ఎంచుకుంటే, ఈక్విటీ నుంచి 6%, డెట్ నుంచి 4% మొత్తంగా నికర ఎన్పీఎస్ రాబడి 10% అవుతుంది.
ఒకవేళ మదుపరి 60:40 నిష్పత్తిలో ఎంచుకుంటే ఈక్విటీ రాబడి 7.20% (12x0.60), డెట్ నుంచి దాదాపు 3.20% (8x0.40) మొత్తం 10.40 ( 7.20+3.20) అంటే దాదాపు 10% రాబడి వస్తుంది.
నెలకు రూ.12 వేలతో ఎంత నిధి సమకూర్చుకోవచ్చు?
పెట్టుబడిదారుడు ప్రస్తుత వయసు 30 ఏళ్లు మరో 30 ఏళ్లలో అంటే 60 ఏళ్ల వయసులో రిటైర్ అవుతారనుకుంటే పెట్టుబడులకు 30 ఏళ్లు దీర్ఘకాల సమయం ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడిదారుడు 60:40 నిష్పత్తి ప్రకారం ఈక్విటీ, డెట్లో నెలకు రూ.12 వేల చొప్పున పెట్టుబడులు పెడితే 10% రాబడి అంచనాతో రూ. 2,71,25,855 కోట్ల నిధిని సమకూర్చుకోవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం రూ. 43,20,000. వడ్డీ రూ.2,28,05,855.
యాన్యుటీ కోసం..
పదవీ విరమణ సమయానికి డబ్బు విత్డ్రా చేసుకోవాలనుకుంటే, సమకూరిన మొత్తం నుంచి 60% నిధిని మాత్రమే ఏకమొత్తంగా విత్డ్రా చేసుకునే వీలుంది. మిగిలిన 40% తప్పనిసరిగా యాన్యుటీ కోసం కేటాయించాలి. అంటే పైన సమకూరిన మొత్తంలో 40% ( రూ.1,08,50,342) యాన్యుటీలకు కేటాయించాలి. ఈ మొత్తం నుంచి 8% రాబడి అంచనాతో నెలకు దాదాపు రూ.72 వేల వరకు పెన్షన్ పొందొచ్చు.
60% మొత్తాన్ని ఎస్డబ్ల్యూపీ ద్వారా పెట్టుబడి పెడితే..
పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల నుంచి క్రమంగా ఆదాయం కావాలనుకుంటున్నవారు సిస్టమేటిక్ విత్డ్రాయిల్ ప్లాన్ (SWP) ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని ద్వారా నెల నెలా అవసరమయ్యే డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై రాబడిని పొందొచ్చు. ఎన్పీఎస్లో విత్డ్రా చేసుకున్న 60% మొత్తాన్ని (రూ.1,62,75,513) మ్యూచువల్ ఫండ్ డెట్ పథకాల్లో ఎస్డబ్ల్యూపీ (SWP) విధానం ద్వారా పెట్టుబడులను పెడితే 8-9% రాబడి అంచనాతో తర్వాతి 25 ఏళ్లు నెలకు సుమారుగా రూ.1,28,000 ఆదాయం పొందొచ్చు. దీంతో పదవీవిరమణ తర్వాత దాదాపు రూ. 2 లక్షల (రూ. 72,000+రూ.1,28,000) నెలవారీ ఆదాయం పొందొచ్చు.
చివరిగా..
మ్యూచువల్ ఫండ్లలో కొంత నష్టభయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ఎక్కువ మంది రిస్క్ తీసుకోలేరు. అటువంటప్పుడు రిస్క్లేని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటిని కూడా ఎంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి -
పన్ను ప్రణాళికకు తరుణమిదే..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు -
రెస్టరంట్లో డబ్బు ఆదా చేయడానికి చిట్కాలు
ఎప్పుడైనా కుటుంబంతో కలిసి రెస్టరంట్కు వెళ్లాలనుకునేవారు బిల్లుపై తగ్గింపు పొందాలనుకుంటారు. అలాంటి వారికోసమే కొన్ని చిట్కాలు. -
ఆన్లైన్ vs ఆఫ్లైన్ బీమా.. ఏది మెరుగైనది?
ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్లైన్, ఆఫ్లైన్లో లభిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఎలా మెరుగైనవి అనేది ఇక్కడ తెలుసుకోండి. -
ఎన్పీఎస్ లాగిన్, క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..
Changes from april 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో చూసేయండి.. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మ చనిపోయారు.. పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు