WhatsApp: ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్.. ఎలా ఉపయోగించాలంటే?
వాట్సాప్ (WhastApp) కొత్తగా ఒకేసారి నాలుగు ఫోన్లలో యాప్ను ఉపయోగించుకునేలా కొత్త ఫీచర్ను పరిచయం చేసింది. మరి, ఈ ఫీచర్తో ఒకేసారి వేర్వేరు ఫోన్లలో వాట్సాప్ను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ (WhatsApp) యాప్ను మొబైల్ ఫోన్తోపాటు అదనంగా మరో నాలుగు డివైజ్లలో (ల్యాప్టాప్, ట్యాబ్, డెస్క్టాప్ కంప్యూటర్) ఉపయోగించేందుకు వీలుగా మల్టీ డివైజ్ ఫీచర్ (Multidevice Feature) అందుబాటులో ఉంది. కానీ, మల్టీ డివైజ్ ఫీచర్లో ఒక ఫోన్లో మాత్రమే లాగిన్కు అవకాశం ఉంటుంది. మరో ఫోన్లో లాగిన్ అయితే ప్రైమరీ ఫోన్ నుంచి లాగౌట్ అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ కంపానియన్ ఫోన్స్ (Companion Phones) ఫీచర్ను పరిచయం చేసింది. ఈ ఫీచర్తో ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ను ఉపయోగించుకోవచ్చు. ఎంతోకాలంగా యూజర్లు ఈ ఫీచర్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. మరి, ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ను ఎలా కనెక్ట్ చేసుకోవాలి? సెకండరీ ఫోన్లలో ఎన్నిరోజులపాటు వాట్సాప్ ఖాతా యాక్టివ్లో ఉంటుందనే వివరాలపై ఓ లుక్కేద్దాం.
నాలుగు ఫోన్లలో వాట్సాప్
- సాధారణంగా వాట్సాప్లో లింక్ డివైజ్ ఫీచర్తో డెస్క్టాప్, వెబ్ లేదా ట్యాబ్లలో లాగిన్ అవుతాం. కానీ, కంపానియన్ ఫోన్స్లో ముందుగా వాట్సాప్ యాప్ను ఇన్స్టాల్ చేయాలి.
- తర్వాత యాప్ ఓపెన్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్ (More Options)లోకి వెళ్లాలి. అందులో లింక్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ (Link To Existing Account) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
- ఆ కోడ్ను వాట్సాప్ ప్రధాన ఖాతా ఉన్న ఫోన్తో స్కాన్ చేయాలి. ఇందుకోసం ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి మోర్ ఆప్షన్స్పై క్లిక్ చేయాలి. అందులో లింక్ డివైజ్ (Link Device) కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి లింక్ ఏ డివైజ్ (Link A Device) ఆప్షన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. అలా, కోడ్ను స్కాన్ చేస్తే కంపానియన్ ఫోన్స్లో వాట్సాప్ లాగిన్ అవుతుంది.
- వాట్సాప్ ప్రైమరీ ఖాతా ఉన్న ఫోన్లో మాదిరే.. కంపానియన్ ఫోన్స్లో కూడా యాప్ను వాడుకోవచ్చు. మెసేజింగ్, మీడియా ఫైల్ షేరింగ్, కాలింగ్ వంటి సదుపాయాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతతో అందుబాటులో ఉంటాయి. అలానే, ఈ ఫోన్లలో లైవ్ లొకేషన్ చూడలేరు. బ్రాడ్కాస్ట్ లిస్ట్ క్రియేట్ చేయడం, చూడటం సాధ్యంకాదు. దాంతోపాటు ప్రైమరీ ఫోన్లో పెట్టిన స్టేటస్ను కంపానియన్ ఫోన్స్ నుంచి డిలీట్ చేయలేరు.
- వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులు, చిన్న కంపెనీల్లో వినియోగదారుల సేవల కోసం ఒకే నంబర్తో వాట్సాప్ను ఉపయోగించే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్తో మరో ఫోన్లో వాట్సాప్ లాగిన్ చేయడం వల్ల, చిన్న వ్యాపార సంస్థ యజమాని అందుబాటులో లేకపోయినా, ఉద్యోగులు ఖాతాదారులకు అవసరమైన సమాచారం అందివచ్చు.
- వాట్సాప్ ప్రైమరీ డివైజ్తో కంపానియన్ ఫోన్స్ పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు కనెక్ట్ కాకుండా ఉంటే.. తర్వాత ఆటోమేటిగ్గా అన్ని ఫోన్ల నుంచి వాట్సాప్ లాగౌట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని వారాల్లో సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్ను ఎలా సెండ్ చేయొచ్చు. -
108 ఎంపీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు
Infinix Note 40 Pro series: వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ రెండు కొత్త మొబైల్స్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో ఈ ఐకాన్ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్ ఇదే..!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాట్సప్కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. -
గూగుల్ ఫొటోస్ గుడ్న్యూస్.. పిక్సెల్ ఫోన్లలోని ఈ టూల్స్ ఇకపై అందరికీ!
Google Photos: తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్ను అందించనున్నట్లు గూగుల్ ఫొటోస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8, 8ప్రో స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM