SVB Crisis: ఒక్క పౌండ్కే HSBC చేతికి ఎస్వీబీ యూకే యూనిట్
Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విషయంలో బ్రిటన్ సైతం చర్యలు వేగవంతం చేసింది. ‘ఎస్వీబీ యూకే’ దివాలా ప్రక్రియను ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్.. ఆ బ్యాంక్ను హెచ్ఎస్బీసీకి విక్రయించింది.
లండన్: అమెరికాలో దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) అనుబంధ ఎస్వీబీ యూకే (SVB UK) విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చర్యలు చేపట్టింది. ఎస్వీబీ యూకే దివాలా ప్రక్రియలో భాగంగా ఆ బ్యాంక్ను హెచ్ఎస్బీసీ (HSBC)కు విక్రయించింది. ఒక్క పౌండ్కే బ్యాంక్ను హెచ్ఎస్బీసీ ఎస్వీబీ యూకే దక్కించుకుంది. డిపాజిటర్లకు రక్షణ కల్పించే ఉద్దేశంతో హెచ్ఎస్బీసీకి విక్రయించినట్లు యూకే ట్రెజరీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఎస్వీబీ దివాలా తీసిన వెంటనే చర్యలు చేపట్టిన బ్రిటన్.. ఈ ఉదయం హెచ్ఎస్బీసీకి బ్యాంక్ను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల డిపాజిటర్లకు రక్షణ కల్పించినట్లు అవుతుందని, ఈ లావాదేవీలో పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఏమాత్రం వినియోగించలేదని ట్రెజరీ చీఫ్ జెరెమీ హంట్ వెల్లడించారు.
ఎస్వీబీ యూకే లిమిటెడ్ను ఒక్క పౌండ్కే కొనుగోలు చేసినట్లు హెచ్ఎస్బీసీ సైతం మరో ప్రకటనలో వెల్లడించింది. ఎస్వీబీ అప్పులు, ఆస్తులను ఈ లావాదేవీల నుంచి మినహాయించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపింది. ఎస్వీబీ యూకే ఖాతాదారులను, ఉద్యోగులను హెచ్ఎస్బీసీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. 2023 మార్చి 10 నాటికి ఎస్వీబీ యూకే 5.5 బిలియన్ల విలువైన రుణాలు ఇచ్చింది. మరో 6.7 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఈ బ్యాంక్ వద్ద ఉన్నాయి. మరోవైపు ఎస్వీబీ దివాలా నేపథ్యంలో అమెరికా సైతం దిద్దుబాటు చర్యలకు దిగింది. బ్యాంక్ ఆస్తులను విక్రయించి డిపాజిట్దారులకు చెల్లించాలని ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్డీఐసీ) నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..