Hurun Global Rich List: అదానీ సంపదలో వారానికి రూ.3,000 కోట్లు ఆవిరి!
Hurun Global Rich List: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాను హురున్ రిచ్ లిస్ట్ విడుదల చేసింది. అత్యధిక మంది బిలియనీర్లు కలిగిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.
Hurun Global Rich List | దిల్లీ: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది భారీగా కుంగినట్లు ‘ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ (Hurun Global Rich List Report)’ నివేదిక తెలిపింది. ఈ ఏడాదిలో ఆయన సగటున వారానికి రూ.3,000 కోట్లు కోల్పోయినట్లు పేర్కొంది. ఫలితంగా ఆసియా ధనవంతుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. రష్యాకు చెందిన ఝోంగ్ శాన్శాన్ ఆ స్థానానికి చేరారు. ప్రస్తుతం అదానీ సంపద 53 బిలియన్ డాలర్లుగా హురున్ నివేదిక లెక్కగట్టింది.
విమానాశ్రయాల నుంచి వంట నూనెల వరకు వివిధ రంగాలకు విస్తరించిన అదానీ గ్రూప్ (Adani Group).. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల తర్వాత తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గ్రూప్నకు చెందిన నమోదిత సంస్థల మార్కెట్ విలువ గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి చేరిన గౌతమ్ అదానీ ఇప్పుడు టాప్-20లో కూడా లేకపోవడం గమనార్హం. గరిష్ఠ స్థాయిల నుంచి ఆయన సంపద 60 శాతానికి పైగా తగ్గింది.
(ఇదీ చదవండి: దేశంలో మరిన్ని ఎయిర్పోర్టులనూ నిర్వహిస్తాం: అదానీ ఎయిర్పోర్ట్స్)
హిండెన్బర్గ్ నివేదిక జనవరి 24న విడుదలైంది. అప్పటి నుంచి అదానీ గ్రూప్ (Adani Group)లోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.7.11 లక్షల కోట్లు ఆవిరైంది. కీలక సంస్థ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు విలువ జనవరి 24న రూ.3,443 వద్ద ఉండేది. తర్వాత అది ఓ దశలో దాదాపు రూ.900 స్థాయికి పడిపోయింది. తర్వాత కొంత వరకు పుంజుకుంది. ప్రస్తుతం అది రూ.1,812 వద్ద ట్రేడవుతోంది.
అంబానీ పరిస్థితి ఇదీ..
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం ఈ ఏడాది తగ్గినట్లు హురున్ నివేదిక (Hurun Global Rich List Report) తెలిపింది. ఆయన సంపద దాదాపు 20 శాతం కుంగి 82 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, వరుసగా మూడో ఏడాది ఆయన ఆసియా కుబేరుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇటీవలే రిలయన్స్ షేరు రూ.2,180 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. ఈ కేలండర్ సంవత్సరంలోనే ఈ స్టాక్ 11 శాతం పతనం కావడం గమనార్హం. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ ఐదు శాతం నష్టపోయింది. స్టాక్ మార్కెట్లలో వచ్చిన దిద్దుబాటు వల్లే రిలయన్స్ షేరు కుదేలైనట్లు నిపుణులు చెప్పారు.
కేవలం భారత బిలియనీర్లదే కాదు..
ప్రపంచవ్యాప్తంగానూ ధనవంతుల సంపద ఈ ఆర్థిక సంవత్సరం కరిగింది. ప్రపంచం మొత్తంలో గత ఏడాది 3,384 మంది బిలియనీర్లు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 3,112కు తగ్గింది. అయితే స్టాక్ మార్కెట్ తిరిగి పుంజుకుంటే కుబేరుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని హురున్ (Hurun Global Rich List Report) తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుదల, వడ్డీరేట్ల పెంపు, డాలర్ బలపడడం వంటి అంశాలు బిలియనీర్ల సంపదను హరించాయని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 70 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయినట్లు హురున్ నివేదిక వెల్లడించింది. తర్వాత ఎలాన్ మస్క్ 48 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.
భారత్కు మూడో స్థానం..
అత్యధిక మంది బిలియనీర్లు కలిగిన దేశాల జాబితాలో చైనా, అమెరికా ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బిలియనీర్లలో 53 శాతం మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారని హురున్ నివేదిక (Hurun Global Rich List Report) తెలిపింది. ఈ జాబితాలో 187 మంది బిలియనీర్లతో భారత్ మూడో స్థానంలో ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే 28 మంది తగ్గారు. తర్వాత యూకే 144 బిలియనీర్లతో నాలుగో స్థానంలో ఉంది. హురున్ రిచ్ లిస్ట్లో భారతీయులు అత్యంత వేగంగా తమ స్థానాన్ని మెరుగుపర్చుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. గత పదేళ్ల వ్యవధిలో గౌతమ్ అదానీ 437 స్థానాలు ఎగబాకినట్లు తెలిపింది. గత ఏడాది కాలంలో 1 బిలియన్ డాలర్ల కంటే అధిక సంపదను జత చేసుకున్నవారి సంఖ్య పరంగా భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
భారత్లో 16 మంది కొత్త బిలియనీర్లు..
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో కొత్తగా 176 మంది స్థానం సంపాదించారు. వీరిలో 16 మంది భారత్కు చెందినవారు. ప్రముఖ మదుపరి దివంగత రాకేశ్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా తొలిసారి ఈ జాబితాలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!