పీపీఎఫ్ లేదా ఎస్ఎస్వై పథకాలలో కనీస చెల్లింపు చేయడంలో విఫలమైతే?
మీరు 30 జూన్, 2020 లోపు ఎప్పుడైనా పూర్తి మొత్తాన్ని జమ చేయవచ్చు.....
మీరు 30 జూన్, 2020 లోపు ఎప్పుడైనా పూర్తి మొత్తాన్ని జమ చేయవచ్చు.
ఒకవేళ మీరు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లేదా సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి చిన్న పొదుపు పథకాలలో కనీస చెల్లింపు చేయడంలో విఫలమైతే, ఎలాంటి చింత అవసరం లేదు. మీరు 30 జూన్, 2020 లోపు ఎప్పుడైనా పూర్తి మొత్తాన్ని జమ చేయవచ్చు. గతంలో దీని గడువు మార్చి 31 గా ఉంది.
పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటి చిన్న పొదుపు పథకాలు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి మార్గాలలో ఒకటి. పెట్టుబడిదారులకు ఉపశమనం కలిగించే విధంగా ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి జమ చేయాల్సిన గడువును మార్చి 31 నుంచి జూన్ 31 వరకు పొడిగించింది.
నిబంధనల ప్రకారం పీపీఎఫ్, ఎస్ఎస్వై ఖాతాలను కలిగిన వారు కనీస వార్షిక కాంట్రిబ్యూషన్ వరుసగా రూ. 500, రూ. 250 చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోపు కనీస మొత్తాన్ని జమ చేయడంలో విఫలమైతే ఖాతా నిలిచిపోతుంది. నిలిచిపోయిన ఖాతా మెచ్యూరిటీ వరకు వడ్డీని సంపాదించుకుంటూనే, ఖాతాను పునరుద్ధరించడానికి సంవత్సరానికి రూ. 50 జరిమానా రుసుముతో పాటు ప్రతి సంవత్సరం పెండింగ్లో ఉన్న కనీస కాంట్రిబ్యూషన్ ను విధిస్తారు. కావున ఒకవేళ మీకు పీపీఎఫ్ లేదా ఎస్ఎస్వై ఖాతా ఉన్నట్లయితే, మీరు కనీస మొత్తాన్ని జమ చేయాలని నిర్ధారించుకోండి.
అయినప్పటికీ, మీరు పీపీఎఫ్, ఎస్ఎస్వైలలో గరిష్టంగా రూ. 1.5 లక్షలు వరకు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఏదేమైనా, మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, గరిష్ట పరిమితిని ఉల్లంఘించలేదని, ఏదైనా అదనపు మొత్తం వడ్డీ లేకుండా తిరిగి చెల్లించే విధంగా ప్రకటించే డిక్లరేషన్ ను సమర్పించాల్సి ఉంటుంది.
మీరు FY20 కోసం జూన్ 30 వరకు వాయిదాలలో కాకుండా ఒకేసారి మాత్రమే జమ చేయాలని గుర్తుంచుకోండి. అలాగే, వడ్డీ కూడా డిపాజిట్ చేసిన రోజు నుంచే ప్రారంభమవుతుంది. FY20 కోసం కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్