KP Singh: ‘ఆమె చురుకైంది’.. 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడిన డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్
రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్(DLF) యజమాని కేపీ సింగ్ ( KP Singh) 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు. ఆయన తన భాగస్వామి వివరాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇంటర్నెట్డెస్క్: భార్య ఇందిర మరణం తర్వాత ఒంటరి వాడైన తనకు ఓ తోడు దొరికిందని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్(DLF) ఛైర్మన్ కేపీ సింగ్( KP Singh ) ప్రకటించారు. 65 ఏళ్ల బంధం తర్వాత భాగస్వామిని కోల్పోతే.. గతంలో మాదిరిగా ఉత్సాహంగా ఉండలేమని పేర్కొన్నారు. జీవితంలో మనిషికి ఓ భాగస్వామి ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. తన కొత్త స్నేహితురాలి విశేషాలను ఆయన ఓ ఆంగ్ల మీడియా ఛానల్తో పంచుకొన్నారు.
నా భార్యే.. నా మిత్రురాలు..!
‘నాకు అద్భుతమైన వైవాహిక జీవితం ఉంది. నాకు సంపూర్ణ మద్దతునిచ్చే మిత్రురాలు నా భార్యే. మేము మంచి భాగస్వాములం. ఆమెను కాపాడుకునేందుకు నేను సర్వశక్తులూ ఒడ్డాను. కానీ, ఏవీ సఫలం కాలేదు. ఆ తర్వాత నేను ఒంటరినైపోయాను. మానసిక కుంగుబాటుకు గురయ్యాను. మీకు ఓ కంపెనీని నిర్వహించే శక్తిని అది ఇవ్వదు. సహజంగానే మీరు 65 ఏళ్ల భాగస్వామ్యం తర్వాత భార్యను కోల్పోతే.. గతంలో మాదిరిగా ఉండలేరు. మీరు భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే నా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని కేపీ సింగ్ వివరించారు.
అందుకే కంపెనీ బాధ్యతలకు దూరం..
భార్య మరణం తర్వాత నుంచి కంపెనీ యాజమాన్యంలో చురుకైన పాత్ర నుంచి వైదొలుగుతున్నట్లు సింగ్ చెప్పారు. ప్రేమించిన వారు దూరం కావడం, వయసు 91 ఏళ్లకు చేరడంతో నిర్ణయాలు తీసుకునే ప్రతిస్పందన తత్వం నెమ్మదిస్తుందన్నారు. కంపెనీ కోసం పనిచేసే సమయంలో పాజిటివ్గా ఉండటం చాలా ముఖ్యమని భావించినట్లు వివరించారు. కానీ, బాధల్లో ఉండటంతో పూర్తి సేవలు అందించలేని పరిస్థితి నెలకొందని.. అందుకే తాను యాజమాన్యం నుంచి దూరమైనట్లు సింగ్ వెల్లడించారు.
‘‘మీకు 90 ఏళ్లు వస్తే.. ఓ లిస్టెడ్ కంపెనీ యాక్టివ్ మేనేజ్మెంట్ నుంచి కచ్చితంగా వైదొలగాలి. ఇక నా కుమారుడు యాజమాన్య బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకొన్నాను. నేను ఇంకా కొనసాగే రకం కాదు. అందుకే ‘గౌరవ’ పదవిలో మాత్రమే కొనసాగుతున్నాను. వాస్తవానికి నా కుమారుడు నాకంటే మెరుగ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కంపెనీని వేగంగా ముందుకు తీసుకెళుతున్నాడు. విలువల విషయంలో రాజీపడలేదు. అందుకే నేను సంతోషంగా ఉన్నాను’’ అని కేపీ సింగ్ పేర్కొన్నారు.
మిగిలిన జీవితం నాకోసం..
పని నుంచి తనను తాను దూరంగా ఉంచుకోవాలని సింగ్ భావిస్తున్నారు. ఇక నుంచి తనకు ఇష్టమైన పనులు చేయడం కోసం సమయాన్ని వెచ్చించనున్నారు. ‘‘నాకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మిత్రులు, స్నేహ సంబంధాలు ఉన్నాయి. నేను గోల్ఫ్ ఆటగాడిని కూడా. చాలా చురుగ్గా ఉన్నాను’’ అని సింగ్ వివరించారు.
సరికొత్త భాగస్వామ్యంపై..
మరణించడానికి ఆరు నెలల ముందు ఓ రోజు నా భార్య ఇందిర నా వద్దకు వచ్చి మాట్లాడిందన్నారు. జీవితంలో చేస్తున్న పనులను వదిలేయ వద్దని కోరినట్లు చెప్పారు. ‘‘సంతోషంగా జీవించే జంట కోరిక ఒక్కటే.. జీవన ప్రయాణంలో ఇద్దరూ కలిసి వెళ్లాలని. ఏ ఒక్కరు ఒంటరిగా మిగిలిపోకూడదు. కానీ నా విషయంలో ఏమైంది.. నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించావు. కానీ, కొన్ని నెలల్లో నేను నిన్ను వదిలి వెళ్లిపోతున్నాను. అందుకే.. నేను వెళ్లిపోయినా.. నీ ముందు చాలా జీవితం ఉంది. నాకో మాటివ్వు.. నా తర్వాత కూడా నీ జీవితంలో నిరాశపడకు. అది ఏరకంగా నీకు సాయం చేయదు. ఈ జీవితం మళ్లీ నీకు తిరిగిరాదు’’ అని కోరినట్లు సింగ్ చెప్పారు.
2018లో ఆమె మరణం తర్వాత దాదాపు రెండేళ్లు తీవ్రమైన ఒంటరితనంలో జీవించినట్లు సింగ్ వెల్లడించారు. ఆ తర్వాత ఓ జీవిత భాగస్వామి దొరికనట్లు వెల్లడించారు. ‘‘నేను చాలా అదృష్టవంతుడిని. ఓ మనోహరమైన వ్యక్తిని కలిశాను. ఇప్పుడు తను నా భాగస్వామి. ఆమె పేరు షీనా. నేను జీవితంలో కలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ఆమె ఒకరు. ఆమె చాలా హుషారుగా ఉంటారు. నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతున్నారు. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా చాలా అద్భుతమైన మిత్రులు ఉన్నారు. నేను ఎప్పుడైనా జీవితంలో నిరాశకు గురైనా.. ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. నేను ఈ రోజు ఉత్సాహంగా ఉన్నానంటే ఆమే కారణమని చెబుతాను’’ అని సింగ్ వెల్లడించారు.
జార్జి సోరస్ వ్యాఖ్యలపై ఏమన్నారంటే..
ఇటీవల బిలియనీర్ జార్జిసోరస్ వృద్ధాప్యం కారణంగా అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారం, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఆరోపణలపై సింగ్ స్పందించారు. ‘‘ప్రస్తుతం నా వయసు ఎంత..? చాలా మంది 70 ఏళ్లు అనుకొంటారు. ఎందుకంటే నేను చురుగ్గా ఉన్నాను కాబట్టి’’ అంటూ సింగ్ పెద్దగా నవ్వేశారు.
తన మామయ్య స్థాపించిన డీఎల్ఎఫ్లో 1961లో కేపీ సింగ్ చేరారు. దాదాపు 5 దశాబ్దాలపాటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2020లో ఛైర్మన్గా పదవీవిరమణ చేశారు. సింగ్ ప్రస్తుత ఆస్తి రూ.66 వేల కోట్లు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది. -
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం