Global Economy: మున్ముందు మరిన్ని కష్టాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ఆందోళన
IMF Expresses Concern over Global Economy: ఇప్పటికే తీవ్ర గడ్డు పరస్థితులు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది......
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ఐఎంఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2022 చాలా కఠినంగా గడవనుందని తెలిపింది. 2023 అంతకంటే దారుణంగా ఉండనున్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జియేవా ‘ఫేసింగ్ ఏ డార్కెనింగ్ ఎకానమిక్ ఔట్లుక్: హౌ ది జీ20 కెన్ రెస్పాండ్’ పేరిట ఓ వ్యాసం రాశారు. కొవిడ్ సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా దాడితో ఇప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పెరుగుతోందని వివరించారు.
ధరలే పెద్ద భారం..
ద్రవ్యోల్బణంపై క్రిస్టలినా తన వ్యాసంలో ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ధరల పెరుగుదల మరింత విపరీతమైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగనున్నట్లు వివరించారు. ఈ ఏడాది అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం 5.7 శాతంగా, వర్ధమాన దేశాల్లో 8.7 శాతంగా ఉండనున్నట్లు అంచనా వేశారు. కొవిడ్ తర్వాత వేగంగా పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ధరల పెరుగుదల పెద్ద అడ్డంకిగా మారినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు దేశాలు తమ శక్తి మేరకు ప్రయత్నించాలని సూచించారు. అలాగే కేంద్ర బ్యాంకులు పరపతి విధానాలను కఠినతం చేయాలని కోరారు. తక్షణమే స్పందించకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు.
వృద్ధికి విఘాతం..
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే సమయంలో ఆర్థిక వృద్ధి దెబ్బతినక తప్పదన్న విషయాన్ని క్రిస్టలినా గుర్తుచేశారు. 2022, 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 3.6 శాతానికి కుంగనున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు వృద్ధి మరింత ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇప్పటికే వృద్ధిరేటు బలహీనమైనట్లు వెల్లడించారు. భవిష్యత్తు అంచనాలు మరింత అస్థిరంగా మారాయని పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలక భాగస్వామి అయిన చైనా పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని క్రిస్టలినా తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న మందగమనం రానున్న నెలల్లో మరింత తీవ్రంగా మారనున్నట్లు అంచనా వేశారు. చైనా సహా జీ-20 దేశాల వృద్ధిరేటు మందగిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు.
శ్రీలంక హెచ్చరిక..
ధరల్ని కట్టడి చేయడంతో పాటు రుణాలు మరింత భారంగా మారకుండా ఉండే ఆర్థిక విధానాల్ని అవలంబించాలని ఐఎంఎఫ్ చీఫ్ సూచించారు. కఠిన పరపతి విధానాల వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. రుణ భారం పెరిగి విధానాల్లో పటిష్ఠ ప్రణాళికలులేని దేశాలకు శ్రీలంకే ఓ పెద్ద హెచ్చరిక అని తెలిపారు. దాదాపు మూడోవంతు దేశాల్లో ప్రభుత్వ బాండ్ల రాబడులు 10 శాతానికిపైకి చేరాయని గుర్తుచేశారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ముప్పును సూచిస్తోందని తెలిపారు.
ఆహారం కోసం సహకారం..
ఆర్థిక సంక్షోభం ఫలితంగా ఆహార సరఫరా కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఐఎంఎఫ్ చీఫ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్వీయ రక్షణాత్మక ధోరణుల్ని వీడి ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ దేశాలు ఎగుమతులపై విధిస్తున్న ఆంక్షలు హానికారకంగా మారతాయని.. దేశీయంగానూ ధరల స్థిరీకరణకు ఉపయోగపడవని వివరించారు. గోధుమలు, వాటి ఉత్పత్తులపై భారత్ విధించిన ఆంక్షల్ని ఈ సందర్భంగా క్రిస్టలినా గుర్తుచేశారు. మరికొన్ని దేశాలూ ఇదే బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం.. 94.1 శాతం అల్పాదాయ దేశాలు, 88.9 శాతం దిగువ మధ్యాదాయ దేశాలు, 87 శాతం ఎగువ మధ్యాదాయ దేశాలు, 66 శాతం అధిక ఆదాయ దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం ఐదు శాతం కంటే ఎక్కువే ఉందని గుర్తుచేశారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!