పీఎల్ఐ ఎఫెక్ట్.. చైనా నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు తగ్గాయ్!
Imports from china: చైనా నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. పీఎల్ఐ పథకం ఇందుకు దోహదం చేసిందని ఓ నివేదిక తెలిపింది.
దిల్లీ: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అనగానే గుర్తుచ్చేది చైనానే. మన దేశంలోకి ఈ ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతుంటాయి. చైనా నుంచి మన దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలదే ప్రధాన వాటా. అలాంటిది ప్రస్తుతం పరిస్థితి మారింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ల్యాప్టాప్లు, పీసీలు, ఇండిగ్రేటెడ్ సర్క్యూట్లు, సోలార్ సెల్స్ దిగుమతులు తగ్గాయి. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) పథకం అందుబాటులోకి వచ్చిన వేళ దిగుమతులు క్షీణించాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనిషియేటివ్ (GTRI) సంస్థ తెలిపింది. వైద్య పరికరాల దిగుమతులు సైతం తగ్గుముఖం పట్టగా.. మొత్తం దిగుమతులు మాత్రం స్వల్పంగా పెరిగినట్లు పేర్కొంది.
- 2021-22తో పోలిస్తే 2022-23లో చైనా నుంచి దిగుమతైన వైద్య పరికరాల విలువ 13.6 శాతం క్షీణించి 2.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
- సోలార్ సెల్స్, డయోడ్ల దిగుమతులు సైతం 70.9 శాతం క్షీణించాయి. మొత్ం 1.9 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి.
- ల్యాప్టాప్లు, పీసీల దిగుమతులు 23.1 శాతం మేర క్షీణించాయి. వీటి విలువ 4.1 బి.డాలర్లు.
- మొబైల్ ఫోన్ల దిగుమతులు సైతం 4.1 శాతం క్షీణించి 857 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
- ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల దిగుమతులు సైతం 4.5 శాతం క్షీణించాయి. వీటి విలువ 4.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
- యూరియా ఇతర ఎరువుల దిగుమతులు సైతం 26 శాతం క్షీణించాయి. వీటి విలువ 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
లిథియం ఐయాన్ బ్యాటరీ దిగుమతులు మాత్రం అమాంతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 96 శాతం పెరిగి మొత్తం 2.2 బిలియన్ డాలర్ల విలవైన బ్యాటరీలు భారత్లోకి వచ్చాయి. దేశీయంగా ఈవీలకు ఆదరణ పెరుగుతుండడమే ఇందుకు కారణం. ‘‘చైనా నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2021-22లో 30.3 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు 2022-23లో 27.6 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో చైనా నుంచి మొత్తం దిగుమతులు 4.2 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయ దిగుమతుల వృద్ధి (16.1 శాతం)తో పోలిస్తే ఇది చాలా తక్కువ’’ అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. చైనా నుంచి సరకుల దిగుమతులు సైతం 16.4 శాతం నుంచి 15.7 శాతానికి తగ్గినట్లు వివరించారు. ముఖ్యంగా పీఎల్ఐ పథకం ఎలక్ట్రానిక్ దిగుమతులు తగ్గడానికి దోహదం చేసినట్లు శ్రీవాస్తవ తెలిపారు.
కొన్ని కేటగిరీ వస్తువుల దిగుమతులు తగ్గినప్పటికీ.. ఇప్పటికీ చైనా నుంచి భారత్ వివిధ రకాల వస్తువులను భారీగా దిగుమతి చేసుకుంటోందని నివేదిక తెలిపింది. 2021-22లో చైనా దిగుమతుల మొత్తం విలువ 94.6 బి.డాలర్లు ఉండగా.. 2022-23లో ఆ మొత్తం 91 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక భారత్ ఎగుమతుల విషయానికొస్తే.. అత్యధికంగా అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్కు ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు స్వల్పంగా ఎగుమతులు పెరుగుతుండగా.. చైనా విషయంలో మాత్రం ఎగుమతులు 36 శాతం మేర క్షీణించాయి. వీటి విలువ 13.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?