Union Budget 2022: ఏప్రిల్ నుంచి ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పలు
చౌకగా దుస్తులు, ఫోన్లు.. గొడుగులు, హెడ్ఫోన్స్ ప్రియం
ఇంటర్నెట్డెస్క్: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పలు వస్తువులపై సుంకాల తగ్గింపు, పెంపు చేపట్టారు. కట్, పాలిష్డ్ వజ్రాలపై సుంకాన్ని 7.5శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. మొబైల్ ఫోన్లలో వాడే కెమెరా లెన్స్లపై డ్యూటీని తగ్గించారు. ఇక కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచారు. దీంతో ఆయా వస్తువుల ధరల్లో మార్పులు జరగనున్నాయి. మరి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. వేటి ధరలు పెరగనున్నాయి.. చూద్దాం
ధరలు తగ్గేవి ఇవే..
⬇ దుస్తులు
⬇ రంగు రాళ్లు, వజ్రాలు
⬇ మొబైల్ ఫోన్లు
⬇ మొబైల్ ఫోన్ ఛార్జర్లు
⬇ పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు
⬇ శీతలీకరించిన నత్తగుల్లలు
⬇ ఇంగువ, కాఫీ గింజలు
వీటి ధరలు పెరుగుతాయ్..
⬆ గొడుగులు
⬆ ఇమిటేషన్ నగలు
⬆ లౌడ్ స్పీకర్లు
⬆ హెడ్ఫోన్లు, ఇయర్ ఫోన్లు
⬆ స్మార్ట్ మీటర్లు
⬆ సోలార్ సెల్స్
⬆ ఎక్స్రే మిషన్లు
⬆ ఎలక్ట్రిక్ బొమ్మల భాగాలు
ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో బ్లెండెడ్ బయోఫ్యుయల్ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్బ్లెండెడ్ ఫ్యుయల్పై లీటర్కు రూ.2 చొప్పున అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అయితే దీన్ని 2022 అక్టోబరు నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!